China: కోట్లమంది చైనీయుల ‘గ్రేట్ మైగ్రేషన్’.. అధ్యక్షుడి ఆందోళన
కొత్త సంవత్సరం వేళ.. చైనాలో కోట్ల మంది పౌరులు తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కరోనా వైరస్తో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న నేపథ్యంలో గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండనుందనే విషయంపై చైనా అధ్యక్షుడు ఆందోళన చెందుతున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.
కరోనా వైరస్ విలయంతో వణికిపోతోన్న చైనాను.. నూతన సంవత్సర వేడుకలు (Lunar New Year) మరింత కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా కోట్లాది మంది చైనీయులు సొంత గ్రామాలకు వెళ్లడం ఇందుకు కారణమవుతోంది. లూనార్ కొత్త సంవత్సరం సందర్భంగా వారంతా సొంతూళ్లకు వెళ్తుండటం(Great Migration)తో.. వైరస్ ఉద్ధృతిని గ్రామాలు తట్టుకుంటాయా? అనే ఆందోళన దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్లో మొదలైనట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
చైనాలో కొత్త సంవత్సరం వేడుకలను (Lunar New Year) జనవరి 21 నుంచి ఫిబ్రవరి నాలుగోవారం వరకు నిర్వహిస్తారు. ఈ 40 రోజుల సమయంలో భారీ సంఖ్యలో చైనీయులు తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఇప్పటికే బీజింగ్, షాంఘై వంటి మహా నగరాల్లో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నట్లు సమాచారం. అక్కడి ప్రయాణికుల వాహనాలు కూడా నగరాలు, గ్రామాల మధ్య 200 కోట్ల ట్రిప్పులు తిరుగుతాయని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి 7వ తేదీ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 48 కోట్ల ప్రజలు స్థానికంగా ఆయా ప్రదేశాలకు ప్రయాణాలు చేసినట్లు తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఈ సారి ప్రయాణికుల సంఖ్య భారీగా ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు గత మూడేళ్లుగా కొవిడ్ ఆంక్షల కారణంగా తమ సొంత గ్రామాలకు వెళ్లలేదని.. ఈసారి మాత్రం ఎలాగైనా ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడుపుతామని చైనీయులు మీడియాతో చెబుతున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కొందరు పీపీఈ కిట్లతో ప్రయాణించడం గమనార్హం.
ఇలా కొవిడ్ ఉద్ధృతిని చవిచూస్తోన్న నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం అక్కడి అధికారుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదే విషయంపై అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఆందోళన చెందుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటివరకు కొవిడ్ కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం భారీ సంఖ్యలో ప్రజలు గ్రామాలకు తరలివెళ్లడం (Great Migration) వైరస్ మరోసారి ఉద్ధృతి చెందడానికి కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
మరోవైపు కొవిడ్ విజృంభణ కారణంగా చైనాలో నిత్యం వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే 60 వేల కొవిడ్ మరణాలు నమోదైనట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. ఇక చైనా కొత్త సంవత్సరం సెలవుల సమయంలో ప్రతిరోజు 36 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తుండటం అక్కడి అధికారులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష