PM Modi: ఎలాంటి వివాదాలైనా చర్చల ద్వారానే పరిష్కారం: మోదీ
ఎంతటి సంక్లిష్ట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత్ విశ్వసిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పారిస్: భారత్ (India) పురోగతిలో ఫ్రాన్స్ (France) సహజ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పి 25 సంవత్సరాలు పూర్తయిందని గుర్తు చేసుకున్న ఆయన.. రానున్న 25 ఏళ్లకు రోడ్మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం, అణుశక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో సహకారం దిశగా మరింత ముందుకు వెళ్తామన్నారు. భారత్లో జాతీయ మ్యూజియం ఏర్పాటుకు ఫ్రాన్స్ భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బాస్టీల్ డే పరేడ్ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో కలిసి వీక్షించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ అవార్డుతో మోదీని ఫ్రాన్స్ సత్కరించింది.
- ఇదీ చదవండి: ఇక అందరి దృష్టీ ‘నిసార్’ వైపు..!
పరేడ్ అనంతరం ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్త్రృతంగా చర్చించారు. అనంతరం మేక్రాన్తో కలిసి, మోదీ మీడియాతో మాట్లాడారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తనకు చేసిన సత్కారం 140కోట్ల మంది భారతీయులకు చెల్లుతుందన్నారు. భారత్లో అవలంబిస్తున్న యూపీఐ పేమెంట్ విధానాన్ని ఫ్రాన్స్లోనూ తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు సమ్మతించినట్లు తెలిపారు. కొవిడ్, ఉక్రెయిన్ సంక్షోభాల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఫ్రాన్స్లోని భారతీయుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక వీసా విధానాన్ని ప్రధాని స్వాగతించారు. భారతదేశంలో క్యాంపస్లను తెరవడానికి ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలను ఆయన ఆహ్వానించారు. ఈ వ్యూహాత్మక చర్యలు రెండు దేశాల మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
ఎంత సంక్షిష్టమైన వివాదాలనైనా చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత్ పూర్తిగా విశ్వసిస్తోందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. శాంతిస్థాపనకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారానికి ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం