NISAR: ఇక అందరి దృష్టీ ‘నిసార్’ వైపు..!
నాసా (NASA), ఇస్రో (ISRO) సంయుక్తంగా చేపడుతున్న ‘నిసార్’ మిషన్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్, అమెరికా రూపొందించిన ఉపగ్రహ విడిబాగాలను ఒకదానికొకటి అనుసంధానించి సింగిల్ స్పేస్ క్రాఫ్ట్ను రూపొందించినట్లు నాసా అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayan 3) ప్రయోగం విజయం దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం సాయంత్రం సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి క్రమంగా చంద్రుడి వైపు పయనం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో త్వరలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఇస్త్రో సంయుక్తంగా చేపట్టబోయే ప్రాజెక్టు నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రేడార్) మిషన్ వైపు అందరి దృష్టీ మళ్లింది.
అంతేకాకుండా ఈ ప్రయోగంలో తాజాగా కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నాసా అభివృద్ధి చేసిన ఉపగ్రహ విడి భాగాలను బెంగళూరు తీసుకొచ్చి యూఆర్రావు శాటిలైట్ సెంటర్లో ఇస్రో రూపొందించిన మరో కొన్ని భాగాలతో అనుసంధానించి సింగిల్ స్పేస్క్రాఫ్ట్ను తయారు చేసినట్లు నాసా తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైన తర్వాత ప్రయోగం కోసం శాటిలైట్ను శ్రీహరికోట తీసుకురానున్నారు. అమెరికాతో కలిసి భారత్ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదే.
ఏమిటీ నిసార్?
భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు భారత్-అమెరికా కలిసి సంయుక్తంగా చేపడుతున్న అంతరిక్ష ప్రయోగమే ఈ నిసార్. ఇది విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను ముందస్తుగా గుర్తించేందుకు వీలుంటుంది. కేవలం భూ ఉపరితలంపైనే కాకుండా భూమి పొరల్లో జరిగే కదలికలను కూడా పసిగట్టొచ్చు. ఫలితంగా భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, సముద్రమట్టం పెరుగుదల ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సంకేతాలను ముందుగానే గుర్తించొచ్చు. ఆయా అంశాల్లో జరిపే అధ్యయనాలకు నిసార్ అందించే సమాచారం మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం సాయంతో హిమాలయాల్లోని హిమనీనదాల ప్రవాహ తీరు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించే యోచనలో ఇస్రో ఉంది.
భూ గ్రహంపై దాదాపు అన్ని ప్రదేశాలను కనీసం 12 రోజులకు ఒకసారైనా పరిశీలించే సామర్థ్యం నిసార్కు ఉందని నాసా స్పష్టం చేసింది. ఎస్యూవీ వాహనం పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహం 2,800 కిలోల బరువు ఉంటుంది. ఈ ఉపగ్రహంలో ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్, సింథటిక్ ఎపార్చర్ రాడార్ (SAR) వంటి పరికరాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా హై-రిజల్యూషన్ ఫొటోలను తీస్తుంది. 2024లో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దీని అంచనా వ్యయం రూ.12,150 కోట్లు. దీని నిర్మాణానికి 2014 సెప్టెంబరులో ఇస్రో, నాసా ముందుకొచ్చాయి. ఈ ఉపగ్రహం జీవితకాలం మూడేళ్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
మధ్యంతర బెయిల్పై విడుదలైన సీఎం కేజ్రీవాల్కు ఇంట్లో తల్లిదండ్రులు స్వాగతం పలికారు. -
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)పై అభియోగాలు మోపాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. -
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. -
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి!
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
ఎయిరిండియా (Air India Express)లో కొందరు క్యాబిన్ సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. -
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..? -
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్ అభివర్ణించింది. -
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!