ఉగ్రవాద జాబితాను రాజకీయం చేయొద్దు
ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణిని భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల ‘క్వాడ్’ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది.
పరోక్షంగా చైనాపై క్వాడ్ ధ్వజం
తీవ్రవాదంపై ప్రత్యేక బృందం ఏర్పాటుకు నిర్ణయం
సమావేశంపై డ్రాగన్ గరంగరం
దిల్లీ: ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణిని భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల ‘క్వాడ్’ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది. డ్రాగన్ పేరు ప్రస్తావించకుండా తీవ్రవాదంపై ఆ దేశం అనుసరిస్తున్న తీరును పరోక్షంగా ఎండగట్టింది. శుక్రవారం భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ నేతృత్వంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రులు ఆంటోనీ బ్లింకెన్, యోషిమాసా హయాషి, పెన్నీ వాంగ్ సమావేశమయ్యారు. అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఈ సారి క్వాడ్ ఎజెండాలో ఉగ్రవాదం కూడా చేరింది. జైశంకర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని క్వాడ్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ‘‘ఉగ్ర జాబితాను రాజకీయం చేయొద్దన్నది సమావేశ నిర్ణయాల్లో ఒకటి’’ అని తెలిపారు. ఇది ఒక రకంగా నేరుగా చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యే. గతంలో నిబంధన 1267 అల్ఖైదా ఆంక్షల కమిటీ కింద భారత్ ప్రతిపాదించిన ఉగ్రవాదుల జాబితాను చైనా సాంకేతిక కారణాలు చూపుతూ పదే పదే అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్లో దాడులకు కుట్రపన్ని పాక్ తీవ్రవాదులకు మద్దతిస్తూ వచ్చింది. వారికి వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాలు ఉన్నా.. చైనా వీటో చేయడంతో చాలా సార్లు భారత్కు చుక్కెదురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉగ్ర జాబితాను రాజకీయం చేయొద్దన్న నిర్ణయం క్వాడ్ తీసుకోవడం గమనార్హం. భారత్ అధ్యక్షతన జరిగిన క్వాడ్ విదేశాంగమంత్రుల సమావేశంపై చైనా మండిపడింది. శాంతి, అభివృద్ధి తదితర అంశాల్లో ఒక దేశం ఇంకో దేశంతో మాట్లాడుకోవాలని, ఇలా కూటములు కట్టడం సరికాదని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష