పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి.. అమెరికాలో రెండు నెలల క్రితం శస్త్ర చికిత్స

ప్రపంచ వైద్య చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా పంది గుండెను శస్త్రచికిత్స ద్వారా అమర్చిన వ్యక్తి మృతి చెందారు. డేవిడ్‌ బెన్నెట్‌(57)కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్‌ ఆసుపత్రిలో గుండె మార్పిడి జరిగింది.  అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా

Published : 10 Mar 2022 07:52 IST

బాల్టిమోర్‌: ప్రపంచ వైద్య చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా పంది గుండెను శస్త్రచికిత్స ద్వారా అమర్చిన వ్యక్తి మృతి చెందారు. డేవిడ్‌ బెన్నెట్‌(57)కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్‌ ఆసుపత్రిలో గుండె మార్పిడి జరిగింది.  అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా ఈ శస్త్రచికిత్సను భావించారు. కొద్ది రోజులుగా అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని, మంగళవారం తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు బుధవారం ప్రకటించాయి. అయితే, మరణానికి కచ్చితమైన కారణాన్ని వివరించలేదు. వివిధ రుగ్మతలతో చావుకు దగ్గరగా ఉన్న తన తండ్రికి ఈ ఏడాది జనవరి 7న అరుదైన గుండె మార్పిడి చికిత్స జరిగిందని,  తద్వారా ఆయనను బతికించేందుకు ఆసుపత్రి వైద్యులు అపూర్వమైన కృషి చేశారని డేవిడ్‌ బెన్నెట్‌ కుమారుడు బెన్నెట్‌ జూనియర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జంతువుల అవయవాలను అమర్చిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీంతో మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రి వైద్యులు జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను డేవిడ్‌బెన్నెట్‌కు అమర్చారు. 1984లో ఒక రకం కోతి గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా 21 రోజులు మాత్రమే జీవించారు. ఆ శస్త్ర చికిత్సతో పోల్చితే డేవిడ్‌ బెన్నెట్‌పై జరిగిన ప్రయోగం మెరుగైన ఫలితాలనే సాధించిందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని