ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F
భారీ బాంబుల సరఫరా నిలిపివేత
రఫాపై దాడిని నిరోధించేందుకే..!
గత వారమే ఈ నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం
వాషింగ్టన్: దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో 2000 పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబులు ఉన్నాయి. భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే రఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వీటి సరఫరాను ఆపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా ధ్రువీకరించారు. తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్కు సరఫరా చేస్తామని.. అయితే రఫాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గత వారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాదాపు 13 నుంచి 14 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. ఈ నగరంపై దాడి చేస్తే భారీ మానవ సంక్షోభం తప్పదని అమెరికా భావిస్తోంది. ఈ విషయాన్ని అనేక సార్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయినా ఇజ్రాయెల్ ఖాతరు చేయడంలేదు. అమెరికా సహా ఎవరూ తమను ఆపలేరని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారు. అమెరికా ఎంతగా నచ్చచెబుతున్నా... రఫాపై వెనక్కి తగ్గేదే లేదంటోంది ఇజ్రాయెల్. ఒక వేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. రఫాలోని హమాస్ను నాశనం చేస్తామంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా బాంబుల సరఫరా నిలిపివేయడం గమనార్హం. అయితే ఇది అంత పెద్ద విషయం కాదని, అమెరికాతో మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది.
కీలక పాస్ను తెరిచాం
రఫా తూర్పు ప్రాంతంలో ఈజిప్టు, గాజా మధ్య కీలక కరెమ్ షాలూమ్ పాస్ను తెరిచినట్లు బుధవారం ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మార్గంపై ఆదివారం రాత్రి హమాస్ రాకెట్లతో దాడి చేసింది. దీంతో ఈ పాస్ను తాత్కాలికంగా ఐడీఎఫ్ మూసివేసింది. ఈ మార్గాన్ని తెరిచినా గాజాకు మానవతా సాయం అందడం లేదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. పాలస్తీనా వైపు ఎవరూ సాయం అందుకోవడానికి లేరని తెలిపింది. అమెరికా యూనివర్సిటీల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బుధవారం జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలోకి ప్రవేశించి గాజా యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. -
అఫ్గాన్లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు
అధిక వర్షాలు అఫ్గానిస్థాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. -
ఆ ఘటనతోనే భారత్తో వాణిజ్య బంధానికి తెర : పాక్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. -
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు
రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..