ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్‌ వే ఫంగ్హా

చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్‌ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు.

Updated : 09 May 2024 06:08 IST

బీజింగ్‌: చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్‌ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. చైనా సీనియర్‌ చట్టసభ సభ్యురాలు ఓయున్‌ కెమాగ్‌(81) అంతిమ యాత్రలో బుధవారం పాల్గొన్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇతర నాయకుల మధ్య వే ఫంగ్హా నివాళులర్పించడం సీసీటీవీ కథనంలో కనిపించింది. దీంతో చైనా ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి ముప్పూ లేదని స్పష్టమవుతోందంటూ హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. చైనా క్షిపణి దళం ఇప్పటి ‘పీఎల్‌ఏ రాకెట్‌ ఫోర్స్‌’లో ఆయన సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఫంగ్హా గతేడాది అక్టోబరు నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని