పోలండ్‌లో రష్యా రాయబారికి ఎర్ర రంగు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలండ్‌లో రష్యా రాయబారి సెర్గే ఆండ్రీవ్‌కు ఎర్రరంగు పూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికులకు నివాళులు అర్పించడానికి వార్సాలోని సమాధుల వద్దకు ఆయన వెళ్తుండగా

Published : 10 May 2022 05:43 IST

వార్సా: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలండ్‌లో రష్యా రాయబారి సెర్గే ఆండ్రీవ్‌కు ఎర్రరంగు పూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికులకు నివాళులు అర్పించడానికి వార్సాలోని సమాధుల వద్దకు ఆయన వెళ్తుండగా వారు అడ్డుకున్నారు. ఆయన చేతిలోని పుష్పగుచ్ఛాన్ని లాక్కొని, దానిని కాళ్లతో తొక్కేశారు. అనంతరం ఎర్ర రంగు పెయింట్‌ పూశారు. రాయబారికి భద్రత కల్పించలేకపోవడంపై పోలండ్‌ విమర్శల్ని ఎదుర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని