Indian woman: నడిసంద్రంలో నౌకనుంచి అదృశ్యమైన భారతీయ మహిళ..!
భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారతీయ మహిళ(Indian woman) నడిసంద్రంలో కనిపించకుండా పోయారు. ఆమె అదృశ్యం వెనకగల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
(ప్రతీకాత్మక చిత్రం)
మాలే: నడి సముద్రంలో క్రూజ్షిప్(cruise ship) నుంచి ఓ భారతీయ మహిళ(Indian woman) అదృశ్యమయ్యారు. మలేషియా(Malaysia)లోని పెనాంగ్ ద్వీప రాష్ట్రం నుంచి సింగపూర్ జలసంధి(Strait of Singapore)లో నౌక ప్రయాణిస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె అదృశ్యమైన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది.
రీటా సహానీ, జాకేశ్ సహానీ భార్యభర్తలు. నాలుగు రోజుల విహార యాత్రలో భాగంగా క్రూజ్షిప్ పెనాంగ్ నుంచి సింగపూర్కు వస్తుండగా.. 70 ఏళ్ల జాకేశ్ నిద్రలేచే సమయానికి రీటా గదిలో కనిపించలేదు. ఆ నౌక(cruise ship)లో ఆమె కోసం వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆయన నౌకలోని సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన వారు తమ ఓవర్బోర్డ్ డిటెక్షన్ సిస్టమ్ను యాక్టివేట్ చేశారు. నౌక సింగపూర్ జలసంధిలో ప్రయాణిస్తున్న సమయంలో ఏదో సముద్రంలో పడిపోయినట్లు గుర్తించారు. రీటా వయస్సు 64 సంవత్సరాలు.
ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష.. శిక్ష తగ్గించిన సైనిక ప్రభుత్వం
ఈ ఘటనపై రీటా కుమారుడు అపూర్వ్ సహానీ మాట్లాడుతూ .. తన తల్లి గురించి తమకు ఎలాంటి జాడ తెలియలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ను మరోసారి సమీక్షించాలని తాము అభ్యర్థించినట్లు వెల్లడించారు. నౌకపై నుంచి జలసంధిలోకి పడిపోయింది తన తల్లే అని ఇంతవరకు ఎలాంటి ధ్రువీకరణ రాలేదన్నారు. నౌకలోని సిబ్బంది ఆమె దూకి ఉండొచ్చని భావిస్తుండగా.. ఆమె అందులోనే ఎక్కడో దగ్గర చిక్కుకొని ఉంటుందని కుటుంబ సభ్యులు ఆశతో ఉన్నారు. ఆమె విహారయాత్రలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి చోటుచేసుకోవడంతో తమకేమీ అర్థం కావడం లేదన్నారు. ఆమె భర్త జాకేశ్ సహానీ ప్రస్తుతం పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. సింగపూర్ జలసంధి.. మలక్కా జలసంధి, దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు