Drugs: ‘కుష్’ కోసం సమాధులు తవ్వుతున్నారు.. చేసేదిలేక ఎమర్జెన్సీ!
Drugs: మాదకద్రవ్యాల సమస్యలతో సియెర్రా లియోన్ దేశం సతమతమవుతోంది. పరిస్థితి చేయిదాటడంతో ఎమర్జెన్సీ విధించింది. డ్రగ్స్ తయారీలో వాడే మనుషుల ఎముకల కోసం దుండగులు అమానవీయ చర్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఫ్రీటౌన్: సాధారణంగా ఒక దేశంలో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పితేనో, లేక రాజకీయ సంక్షోభం తలెత్తితేనో అత్యవసర పరిస్థితి విధిస్తారు. శాంతి భద్రతలు చేయి దాటిపోయినా కఠిన ఆంక్షలు అమలుచేస్తారు. కానీ, దేశ ప్రజలు డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్నారని ఎమర్జెన్సీ విధించారని ఎప్పుడైనా విన్నారా? పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో (Sierra Leone) అదే జరిగింది. యువకుల్లో చాలామంది ఓ రకమైన మత్తు పదార్థం తీసుకొని వీధుల్లో పడిపోతున్నారు. పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో చేసేది లేక ఆ దేశ అధ్యక్షుడు జులియస్ బయో ఇటీవల అత్యవసర పరిస్థితిని విధించారు.
అంతా ‘కుష్’ మాయ..
కుష్ (Kush Drug) అనే మత్తుపదార్థమే సియెర్రా లియోన్ ఎదుర్కొంటున్న సమస్యకు ప్రధాన కారణం. ఇది దాదాపు ఆరేళ్ల క్రితం ఆ దేశంలోకి ప్రవేశించింది. నిత్యం అంతర్గత కల్లోలాలు, జాతుల మధ్య వైరం వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనికి కుష్ తోడవటంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రధాన పట్టణాల వీధుల్లో ఎక్కడ చూసినా యువకులు దాని మత్తులో ఊగిపోతుండడం సర్వ సాధారణమైపోయింది.
శ్మశానాల్లో దొంగతనాలు..
కుష్ వివిధ రకాల మత్తు పదార్థాల మిశ్రమం. దీంట్లో మనిషి ఎముకలను కూడా వాడతారని స్థానికులు తెలిపారు. ఈ డ్రగ్కు డిమాండ్ పెరగడంతో డీలర్లు అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్విస్తున్నారు. అస్థిపంజరాలను వెలికితీసి ఆ ఎముకలను తయారీదారులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వందలాది సమాధులను తవ్వినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రభుత్వం శ్మశానాల వద్ద భద్రతను ఏర్పాటుచేస్తోంది. ముఖ్యంగా ఫ్రీటౌన్ వంటి పెద్ద పట్టణాల్లో సమాధుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.
దేశ అస్థిత్వానికే ముప్పు..
వినాశకరమైన సింథటిక్ డ్రగ్ కుష్ వల్ల సియెర్రా లియోన్ (Sierra Leone) అస్థిత్వానికే ముప్పు ఏర్పడిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు బయో ఆందోళన వ్యక్తంచేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ప్రతీ డిస్ట్రిక్ట్లో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అలాగే డీలర్ల పని పట్టేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరఫరాను నిలిపివేయడమే సమస్య పరిష్కారానికి తొలిమెట్టని తెలిపారు.
వందలాది మంది మృత్యువాత..
ఇప్పటివరకు కుష్ వినియోగం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎంతనేది అధికారిక గణాంకాలేమీ లేవు. కానీ, ఇటీవల వందల మంది యువకులు ఈ డ్రగ్ కారణంగా అవయవాలు దెబ్బతిని మరణించారని వైద్యుడొకరు తెలిపారు. కుష్ వల్ల ముఖాలు వాచిపోయి శరీరమంతా గాయాలతో చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించారు. సియెర్రా లియోన్ సైకియాట్రిక్ హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య 2020 నుంచి 2023 మధ్య 4,000 శాతం పెరిగినట్లు చెప్పారు.
అయితే, ఎమర్జెన్సీ ప్రకటనపై ఆ దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటినుంచి శాంతిభద్రతలపై దృష్టిసారిస్తే ఈ సమస్య తలెత్తేది కాదని కొందరు వాదిస్తున్నారు. పరిస్థితి చేయిదాటిన తర్వాత చర్యలు చేపట్టినా ఉపయోగం లేదంటున్నారు. మరికొందరేమో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. డ్రగ్స్ సమస్యను పరిష్కరించేందుకు ఎమర్జెన్సీ సరైన నిర్ణయమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
UAE Blue Residenency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..? -
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే