Turkey: మృత్యువును గెలిచిన ఈ పసిపాప గుర్తుందా..? ఎట్టకేలకు తల్లి చెంతకు
తుర్కియేలో భూకంప శిథిలాల్లో చిక్కుకుని.. 128 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన చిన్నారి గుర్తుందా..! ఎట్టకేలకు ఆ పసిపాపను ఆమె తల్లి చెంతకు చేర్చారు.
అంకారా: దాదాపు రెండు నెలల క్రితం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ధాటికి తుర్కియే (Turkey), సిరియా (Syria)లు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయానికి ఇరు దేశాల్లో దాదాపు 57వేలకు పైగా మృతి చెందారు. ఒక్క తుర్కియేలోనే 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల క్రమంలో భూకంపం ధాటికి నేలకూలిన భవనాల శిథిలాలనుంచి అనేక మందిని ప్రాణాలతో వెలికితీశారు. తుర్కియేలోని హతాయ్లో ఓ రెండు నెలల పసిపాప.. ఏకంగా 128 గంటల తర్వాత మృత్యుంజయురాలిగా బయటపడి, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ముద్దులొలికే ఆ చిన్నారి ఫొటో అప్పట్లో నెట్టింట వైరల్గా మారింది. అయితే, పాప తల్లి ఈ ఘటనలో మృతి చెందినట్లు అంతా భావించారు. కానీ, ఆమె బతికే ఉన్నట్లు ఇటీవల తెలిసింది.
దీంతో తాజాగా శిశువును తల్లి చెంతకు చేర్చారు. ఉక్రెయిన్ మంత్రి ఆంటన్ గెరాషెంకో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘తుర్కియేలో భూకంప శిథిలాల కింద 128 గంటలపాటు ప్రాణాలతో నిలదొక్కుకున్న పాప బహుశా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె తల్లి మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆమె బతికే ఉన్నారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 54 రోజుల తర్వాత.. డీఎన్ఏ పరీక్ష అనంతరం బిడ్డను తల్లి చెంతకు చేర్చారు’ అని గెరాషెంకో ట్వీట్ చేశారు. అంతకుముందు తుర్కియే కుటుంబ, సామాజిక సేవల శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమంటూ అభివర్ణించారు. ప్రపంచంలో ఎంతో అద్భుతం ఏంటంటే.. తల్లి, బిడ్డను కలపడమేనని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు. -
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్