Suella Braverman: రిషి సునాక్ కీలక నిర్ణయం: సుయెల్లా బ్రేవర్మన్పై వేటు.. కేబినెట్లోకి మాజీ ప్రధాని
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు.
లండన్: బ్రిటన్ (Britain) ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak).. ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ (Suella Braverman)ను పదవి నుంచి తొలగించారు. కొద్ది రోజుల క్రితం లండన్లో పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శిస్తూ సుయెల్లా బ్రేవర్మన్ ఒక కథనాన్ని ప్రచురించారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆమె ఇతరులను రెచ్చగొట్టే విధంగా కథనాన్ని ప్రచురించారని, దానివల్లే పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున లండన్ వీధుల్లోకి వచ్చారని, ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సోమవారం ప్రధాని సునాక్ నిర్ణయం తీసుకున్నారు.
బ్రిటన్ కేబినెట్లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం గందరగోళ సమయాన్ని ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు. అదే సమయంలో మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినందుకు బాధ్యత వహిస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచి, ఇంటీరియర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.
డేవిడ్ కామెరాన్కు విదేశాంగ శాఖ..
మరోవైపు, మంత్రివర్గంలో రిషి సునాక్ కీలక మార్పులు చేశారు. సుయెల్లా బ్రేవర్మన్ స్థానంలో జేమ్స్ క్లేవర్లీకి హోం మంత్రిత్వ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక, విదేశాంగ శాఖ బాధ్యతలను మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్కు అప్పగించారు. కాగా.. ఓ మాజీ ప్రధాని, చట్టసభల్లో లేని నేతకు ఇలా కేబినెట్లో స్థానం కల్పించడం యూకే రాజకీయాల్లో అరుదైన సందర్భంగా. త్వరలోనే ఆయన ఎగువ సభకు నామినేట్ చేయనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన దాదాపు ఏడేళ్ల తర్వాత.. కామెరాన్ మళ్లీ యూకే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కామెరాన్ 2010 నుంచి 2016 వరకు యూకే ప్రధానిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంపై 2016లో కామెరాన్ మూడు రెఫరండమ్లు తీసుకొచ్చారు. దీనిపై ఓటింగ్ చేపట్టగా.. బ్రెగ్జిట్కు అనుకూలంగా యూకే ప్రజలు ఓటేశారు. బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని కామెరాన్ గట్టిగా ప్రచారం చేసినప్పటికీ.. మెజార్టీ ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. దీంతో 2016లో జూన్లో కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఆ సయమంలో రిషి సునాక్ కూడా బ్రెగ్జిట్కు మద్దతు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు ఇకపై వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునే వీలుంటుంది. -
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
భారత్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లండన్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. -
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM