Pakistan: ఇమ్రాన్ ఖాన్పై 140 కేసులు.. జైల్లో పెట్టినా తలవంచనన్న మాజీ పీఎం
తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినా లొంగిపోయే ప్రసక్తే లేదని.. దేశంలో న్యాయపాలన కోసం తన పోరాటం కొనసాగుతుందని పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు.
లాహోర్: తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినా లొంగిపోయే ప్రసక్తే లేదని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు, ప్రజల కోసం తాను పోరాటం చేస్తున్నానని ఉద్ఘాటించారు. అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతోన్న ఆయన.. దేశంలో న్యాయపాలన కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు.
‘నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినాసరే.. నేను మాత్రం వాళ్లతో రాజీపడను, లొంగిపోను. దేశంలో న్యాయపాలన కోసం పోరాటాన్ని కొనసాగిస్తా’ అని తనను మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశారు. తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుపట్టిన ఆయన.. తనను వ్యక్తిగతంగా కలిసిన వారిపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఆర్మీ కోర్టుల్లో విచారణ జరుపుతున్నారని మండిపడ్డారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్పై దాదాపు 140 కేసులు ఉన్నాయి. ఉగ్రవాదం, హింసకు ప్రేరేపించడం, దహనకాండ, హత్యాయత్నం, అవినీతి, మోసానికి సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా 19 కేసుల్లో ఇప్పటివరకు ఉన్న ముందస్తు బెయిల్ పొడిగింపు కోసం సోమవారం ఉదయం ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్కు చేరుకున్నారు. ఇదిలాఉంటే, మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం పీటీఐ కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దాదాపు 20సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో దాదాపు 10వేల మంది పీటీఐ పార్టీ కార్యకర్తలను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినట్లు అంచనా. ఇదే సమయంలో మరికొన్ని కేసుల్లో ఇమ్రాన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన