
విశాఖ: తల్లి శిక్షణతో క్రీడాకారిణిగా రాణించడమే కాకుండా.. ఆపదలో ఉన్న పిల్లల్ని కాపాడిన ఆ యువతిని కేంద్ర పురస్కారం వరించింది. విశాఖ జిల్లా కొత్తకోటకు చెందిన సాహితి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి ఈతలో నైపుణ్యం సాధించి ఎన్నో అవార్డులు అందుకుంది. తల్లిదండ్రులతో కలిసి నవంబర్ 4న విహారయాత్రకు వెళ్లిన సాహితి సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడింది. ఈ సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ రక్ష పురస్కారానికి ఎంపిక చేసింది. సాహితి లాంటి విద్యార్థి తమ కాలేజీలో చదవడం ఎంతో గర్వకారణంగా ఉందని అధ్యాపకులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈత వచ్చు కావున సముద్రంలో మునిగిపోతున్న చిన్న పిల్లలను త్వరగా కాపాడగలిగాను. చిన్నప్పటి నుంచి యోగా చేస్తున్నాను. స్విమ్మింగ్ చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతోంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను ఈ ఘనత సాధించాను.. నా లక్ష్యం ఐఐటీ సాధించడం. స్విమ్మింగ్లో 25 రికార్డులు సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది.
ఇవీ చదవండి..
రుషికొండ వద్ద పర్యాటక ప్రాజెక్టు!
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్కి ముందే తెలుసు
- జూమ్కాల్లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్