బ్రేకింగ్

breaking
24 Jan 2022 | 12:30 IST

ఉద్యోగుల సమ్మెపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. ‘‘ఇప్పటివరకు జీతాలు పెంచాలని సమ్మెలు చూశాం. పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె నోటీసు ఇవ్వాలనుకోవడం ఇదే ప్రథమం. పాత జీతాలే చాలంటూ సమ్మె చేయడం ఎప్పుడూ చూడలేదు. కరోనా పరిస్థితి, ఆర్థిక దుస్థితి దృష్ట్యా సమ్మె ఆపాలని కోరుతున్నాను. ప్రభుత్వం, ఉద్యోగులు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలి’’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీ సీఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు అత్యవసర సమావేశం చేపట్టారు. ఇతర అసోసియేషన్లతో కలిసి సమ్మెకు వెళ్లే అంశంపై చర్చిస్తున్నారు.

మరిన్ని

తాజా వార్తలు