పద్మావతమ్మా.. పక్షపాతమేంటమ్మా?
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీఓ పద్మావతి వైకాపా అనుకూల నిర్ణయాలతో వివాదాస్పదమవుతున్నారు.
గుడివాడ రిటర్నింగ్ అధికారి వివాదాస్పద నిర్ణయాలు
వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు
ఎన్నికల నిష్పక్షపాత నిర్వహణ అనుమానమే
ఈనాడు, అమరావతి: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీఓ పద్మావతి వైకాపా అనుకూల నిర్ణయాలతో వివాదాస్పదమవుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేనే ఆమెకు గుడివాడలో ఆర్డీఓగా పోస్టింగ్ ఇప్పించారని.. అక్కడే రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతుండటంతో స్వామి భక్తి ప్రదర్శిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో కీలకమైన గుడివాడ నియోజకవర్గం వివాదాలకు చిరునామా. అధికార పార్టీ నేతల దారుణాలూ అధికమే. అక్కడి ప్రజాప్రతినిధి క్యాసినోలకు అవకాశమిస్తే.. గంజాయి బ్యాచ్కు పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారు. గుడివాడలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. అధికారులు కళ్లకు గంతలు కట్టుకుంటారనేది బహిరంగంగా జరిగే చర్చ. అలాంటిచోట ఇప్పుడు ఆర్వో నిర్ణయాలూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటున్నాయనేది తెదేపా వాదన.
పోస్టింగ్ నుంచే మొదలు
- గుడివాడ ఆర్డీఓగా పద్మావతి రెండేళ్ల కిందటే బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ఆర్డీఓగా అదే తొలి పోస్టింగ్. ఎమ్మెల్యే కొడాలి నాని కావాలని ఆమెకు పోస్టింగు ఇప్పించారని ప్రచారం.
- గుడివాడలో మట్టి తవ్వకాలు, భూకబ్జాలపై పలు ఫిర్యాదులు వచ్చినా ఆర్డీఓ చర్యలు తీసుకోలేదు. నందివాడ, గుడివాడ మండలాల్లో ఇష్టానుసారం తవ్వకాలు జరిగాయి. నందివాడలో ఓ వ్యక్తి సీఎం బామ్మర్దినని చెబుతూ దాదాపు వంద ఎకరాలు ఆక్రమించి, చెరువులు తవ్వి లీజుకు ఇచ్చారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చినా, కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లినా ఆర్డీఓ స్పందించలేదు.
- హైదరాబాద్లో ఉంటున్న నందివాడకు చెందిన మహిళ భూమిని ఇటీవల మరో వ్యక్తికి అక్రమంగా రిజిస్టర్ చేశారు. దీనిపై ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా.. కనీసం విచారణ నిర్వహించలేదు.
- ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎమ్మెల్యేతో ఆర్డీఓ ఫోన్లో మాట్లాడిన తీరు చర్చకు దారితీసింది. కలెక్టర్ను నువ్వే బదిలీ చేయించావుగా అని ఎమ్మెల్యే ఆర్డీఓతో మాట్లాడటం, అవన్నీ ఫోన్లో వద్దని ఆమె వారించడం, పాత తేదీలతో పట్టాలు ఇవ్వచ్చుగా అని ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో రికార్డు వెలుగులోకి వచ్చింది.
- ఏలూరులో నివాసం ఉంటున్న ఆర్డీఓ అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారు. కార్యాలయంలో అందుబాటులో ఉండరు. ఎమ్మెల్యే ఫోన్కు తప్ప ఇతరులు కాల్ చేసినా స్పందించరు. వైకాపా నేతలను తప్ప సాధారణ ఫిర్యాదుదారులను కలవరని విమర్శలున్నాయి.
- గుడివాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జి భూసేకరణ పరిహారంలో తెదేపా సానుభూతిపరులకు ఓ లెక్క, వైకాపా వారికి ఓ లెక్క వర్తింపజేశారని ఫిర్యాదులు వచ్చాయి.
- ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక గుడివాడలో ‘మేమంతా సిద్ధం’ పోస్టర్లు భారీగా వెలిసినా వాటిని తొలగించలేదు. ఇవి పత్రికల్లో వచ్చాక తొలగించి, పత్రికల్లో వచ్చిన చిత్రాలు పాతవి అని కలెక్టర్కు నివేదిక పంపారు. గుడివాడలో చాలా ప్రాంతాల్లో వైకాపా అనుకూల ప్రచార చిత్రాలను తొలగించలేదు.
ఇదేం న్యాయం?
- కొడాలి వెంకటేశ్వరావు అనే దివ్యాంగ దళితుడు నామినేషన్ వేసేందుకు వస్తే ఆయనపై ఆర్డీఓ దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు వచ్చారు, ఇక్కడి నుంచి వెళ్లకుంటే క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. కొడాలి వెంకటేశ్వరరావు పేరున్న వ్యక్తి నామినేషన్ వేస్తే అదే పేరున్న ఎమ్మెల్యేకు ఇబ్బంది అవుతుందేమోనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తర్వాత మీడియా, లాయర్లు ఉండటంతో అనుమతించి నామినేషన్ తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) ఆర్డీఓను వివరణ కూడా అడగకపోవడంపై దళిత సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
- వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్లో గుడివాడ మున్సిపాలిటీ నుంచి అద్దెకు తీసుకున్న భవనం వివరాలను పొందుపర్చలేదు. దీనిపై ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేస్తే.. తాను నామినేషన్ అనుమతించాననీ, ఆమోదించానని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించింది: చంద్రబాబు
విజయవాడలో ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కల్యాణ్తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. -
మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీవేటు
మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఏపీలో కూటమిదే విజయం.. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే: మోదీ !
ఏపీలో కూటమి జోష్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిదే విజయమని, అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయని చంద్రబాబు, పవన్తో ఆయన చెప్పినట్లు సమాచారం. -
విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో.. జనం బ్రహ్మరథం
ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
‘మన ఇంటికి బాబు’.. టెక్నాలజీ సాయంతో మన ఇంటికే చంద్రబాబు, లోకేష్
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఓటర్లకు మరింత చేరువ అవుతోంది. -
వైకాపాకు కౌంట్డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. -
ఆత్మగౌరవం ఉన్నవారంతా వైకాపాను వీడారు: పవన్ కల్యాణ్
‘క్లాస్ వార్’ అంటూ ఊదరగొట్టే సీఎం జగన్.. చదువుకున్న యువకులకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
పెనమలూరులో వైకాపా ప్రలోభాలు.. పంపిణీకి సిద్ధంగా ఉంచిన వస్తువులు స్వాధీనం
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాలకోసం ఉంచిన వివిధ రకాల వస్తువుల్ని పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నేతలకు భూములు కట్టబెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: నారా భువనేశ్వరి
ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్: వైఎస్ భారతిపై షర్మిల ఫైర్
ఓటమి భయంతో అవినాష్రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
‘అమేఠీలో తుపాకుల పరిశ్రమ ఉంది’: పాక్ నేతకు స్మృతి ఇరానీ కౌంటర్
పాకిస్థాన్, రాహుల్ గాంధీ (Rahul Gandhi) మధ్య ఉన్న సంబంధం ఏంటని భాజపా నాయకురాలు, అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) ప్రశ్నించారు. -
కూటమికి మద్దతుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రచారం
తెదేపా, జనసేన, భాజపా కూటమికి మద్దతుగా విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రచారం చేయనున్నారు. -
డోన్లో బుగ్గన ఉక్కిరిబిక్కిరి!
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. బుగ్గనకు దీటైన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి అని భావించిన తెదేపా అధిష్ఠానం ఆయన్ను రంగంలోకి దింపింది. -
తండ్రీ బిడ్డల్ని దూరం చేసిన అంబటి రాంబాబు అసలు మనిషేనా?
‘నా బిడ్డల్ని నాలుగేళ్లుగా నాకు దూరం చేసి, నా ప్రాణాన్ని తీసేసినంత పనిచేసి.. ఎలాంటి తప్పూ చేయలేదని బుకాయిస్తున్నారా? ఇదేనా న్యాయం’ అంటూ మంత్రి అంబటి రాంబాబును ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ ప్రశ్నించారు. -
అధికార పార్టీ అడ్డదారులు.. వైకాపా కూపన్ల పంపిణీకి అడ్డుకట్టేది?
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అధికార పార్టీ అనేక అడ్డదారులు తొక్కుతోంది. ఇందులో భాగంగా తాయిలాలను అందించేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేవీఉష, ఆమె భర్త శ్రీచరణ్రెడ్డి, సీఎం జగన్ చిత్రాలతోపాటు.. ఆ పార్టీ గుర్తు ఉన్న కూపన్లు, వాటి పక్కనే ఓటరు వివరాలను ముద్రించి ఓటర్లకు అందజేస్తున్నారు. -
ఎన్నికల వేళ.. వైకాపా మెడకు రైల్వేజోన్ ఉచ్చు!
ఎన్నికల వేళ వైకాపాకు రైల్వే జోన్ ఉచ్చు బిగుసుకుంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైల్వే జోన్కు స్థలం కేటాయించలేదన్న మాట అనగానే, వైకాపా మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. -
పవన్ రోడ్షోకు అడ్డంకులు సృష్టించే యత్నం!
పిఠాపురంలో ఈ నెల 10న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న రోడ్షోకు అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
ఓటుతో దిల్లీ పీఠం కదలాలి
‘బటన్ నొక్కితే డబ్బులు పడకుండా చంద్రబాబు చూస్తున్నారు. పథకాలను అడ్డుకుంటున్నారు. అవి అమలయ్యేలా చూడాలని కోర్టుకు వెళ్లాల్సి వస్తోందంటే ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి. -
పవన్కల్యాణ్ను ‘గెలిపించండి’
నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. -
మీ వాళ్లే వద్దంటున్నారు.. ప్రజలెలా నమ్ముతారు?
జగన్ను సొంత కుటుంబసభ్యులతో పాటు ఆయన పార్టీవారూ నమ్మడం లేదని, ప్రజలెలా నమ్మాలో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. -
జగన్, పెద్దిరెడ్డి.. ఖజానాను మింగేశారు
‘ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేరు. అదేవిధంగా రాష్ట్రంలో జిమ్(జగన్) ఉన్నారు.
తాజా వార్తలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్