బ్రేకింగ్

breaking
30 May 2023 | 17:38 IST

TSPSC: ఇకపై పరీక్షలు రాయకుండా 37 మంది డీబార్‌

హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టు అయిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతోంది. లీకేజీ వ్యవహారంలో ప్రమేయమున్న అభ్యర్థులను డీబార్‌ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. సిట్ అరెస్టు చేసిన 37 మందిని భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. కమిషన్‌ నిర్ణయంపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ 37 మందికి టీఎస్పీఎస్సీ నోటీసులు జారీ చేసింది.

మరిన్ని

తాజా వార్తలు