భారత్ బయోటెక్తో బ్రెజిల్ ఒప్పందం!
సావో పాలో(బ్రెజిల్) : దేశీయ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్తో బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 20 మిలియన్ డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం ఆ దేశ ఆరోగ్య శాఖ భారత కంపెనీతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే, దీన్ని ఇంకా స్థానిక అధికార యంత్రాంగాలు ధ్రువీకరించాల్సి ఉంది. 20 మిలియన్ డోసుల్లో తొలి 8 మిలియన్లు బ్రెజిల్లోని ప్రెసిసా మెడికామెంటోస్లోనే ఉత్పత్తి అవుతాయని.. అవి మార్చి నాటికి అందుతాయని ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో అధికార యంత్రాంగం వెల్లడించింది. మిగిలిన 8 మిలియన్ల డోసులు ఏప్రిల్లో, తదుపరి నాలుగు మిలియన్ల డోసులు మే నాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
బ్రెజిల్లో ఇప్పటి వరకు 1,03,90,461 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 2,51,498 మంది మృత్యువాతపడ్డారు. కేసులపరంగా బ్రెజిల్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉండగా.. మరణాల్లో రెండో స్థానంలో ఉంది. ఆ దేశ జనాభా 21 కోట్ల కాగా.. ఇప్పటి వరకు దాదాపు నాలుగు శాతం మందికి టీకా అందింది. అయితే, ప్రెసిసాగానీ, భారత్ బయోటెక్గానీ తమ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి...
పెట్రోపై పన్నులు క్రమేణ తగ్గించాలి
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?