AP Inter: ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ విడుదల

ఏపీలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ విడుదలైంది.

Updated : 26 Apr 2024 16:01 IST

అమరావతి: ఏపీలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. ఈమేరకు పరీక్షల షెడ్యూల్‌తో టైం టేబుల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయి. నైతికత, మానవ విలువల పరీక్ష జూన్‌ 6న, పర్యావరణ విద్య 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.

ఇటీవల ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన అధికారులు.. రీకౌంటింగ్‌, రీ-వాల్యుయేషన్‌కు ఏప్రిల్‌ 18 నుంచి 24వరకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన వారితో పాటు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 1 నుంచి 4 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని