AP News:విదేశీ సాయానికి కేంద్రం మెలిక
‘రుణదాత ఇచ్చే నిధులతోపాటు మా వాటా ప్రకారం ముందుగా నిధులివ్వాల్సి ఉన్నా అలా ఇవ్వలేం. ముందు రుణ మొత్తం రుణదాత నుంచి ఇప్పించండి. ఆ సొమ్ముతో పనులు చేస్తాం. ఆనక మా వాటా
మొత్తం రుణం ముందే ఇవ్వడం కుదరదు
అన్ని ప్రాజెక్టుల్లో మీవాటా నిధులివ్వండి
లేకుంటే గ్రామీణ రహదారులకూ అడ్వాన్సులు ఇవ్వలేమంటూ రాష్ట్రానికి లేఖ
రూ.11,290 కోట్ల ప్రాజెక్టులపై నీలినీడలు
ఈనాడు - అమరావతి
‘రుణదాత ఇచ్చే నిధులతోపాటు మా వాటా ప్రకారం ముందుగా నిధులివ్వాల్సి ఉన్నా అలా ఇవ్వలేం. ముందు రుణ మొత్తం రుణదాత నుంచి ఇప్పించండి. ఆ సొమ్ముతో పనులు చేస్తాం. ఆనక మా వాటా నిధులు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చిస్తాం’ అని ఆంధ్రప్రదేశ్ కోరగా.. కేంద్ర ఆర్థిక శాఖ అలా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఒప్పందం ప్రకారం మీ వాటా నిధులిచ్చి ఆ మొత్తంతో పనులు చేస్తేనే రుణమైనా, అడ్వాన్సు అయినా ఇవ్వగలమని కుండబద్దలు కొట్టింది. అంతే కాదు.. ప్రపంచబ్యాంకు సాయంతో చేపట్టిన 24×7 ప్రాజెక్టుతోపాటు విదేశీ ఆర్థికసాయంతో చేపడుతున్న అన్ని ఇతర ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటా నిధులు తక్షణమే ఏజెన్సీలకు బదిలీ చేయాలని షరతు పెట్టింది. అలా చేయకపోతే గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులో రాష్ట్రం కోరుతున్న రూ.540 కోట్ల అడ్వాన్సు కూడా ఇవ్వబోమని తేల్చేసింది. మరో 3 రహదారుల ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి పనుల పురోగతి తెలియజేయకపోతే అడ్వాన్సులివ్వడంపైనా పునరాలోచిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్కు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో రూ.11,290 కోట్ల రహదారి ప్రాజెక్టుల భవితవ్యం చర్చనీయాంశమైంది.
* ఆసియా మౌలిక సౌకర్యాల కల్పన బ్యాంకు రుణసాయంతో రూ.4,290 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,285 కోట్లు. తొలి దశలో 1,400 కి.మీ.రోడ్లు నిర్మించేందుకు పనులు చేపట్టారు.
కొంతమేర పనులు జరిగాయి. 2019లో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టు 2024లో పూర్తి కావాల్సి ఉంది. ఇంతవరకు చెప్పదగ్గ పురోగతి లేదు.
* న్యూడెవలప్మెంటు బ్యాంకు సాయంతో రాష్ట్రంలో మండల కేంద్రాల మధ్య, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల అనుసంధాన ప్రాజెక్టు, వంతెనల పునర్నిర్మాణం లేదా మరమ్మతును 2 ప్రాజెక్టులుగా రాష్ట్రం చేపట్టింది. రూ.6,400 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం. ఇందులో రూ.2,130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలి. తొలి దశలో రూ.2,970 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.1,860 కోట్ల సివిల్ పనులకు గతేడాది మార్చిలో గుత్తేదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంతవరకు పది శాతం పనులు కాలేదు.
ఇప్పుడెలా?
రూ.6,400 కోట్ల ప్రాజెక్టులో అప్పు మొత్తం ముందే ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఇలా రుణదాతలు ఇవ్వబోరని, కేంద్రం అంగీకరించదని ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నా సరే లేఖ రాయాలని ఒత్తిళ్లు ఉన్నాయంటే ఆ ప్రాజెక్టులో రాష్ట్రం తన వాటా ఇచ్చేందుకు ఏ స్థాయిలో సిద్ధంగా ఉందో ఇట్టే అవగతమవుతుందని ఆర్థిక శాఖలోని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
* పైగా గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుకు రూ.540 కోట్ల అడ్వాన్సు ఇవ్వాలంటే విదేశీ సాయంతో చేపట్టే మిగిలిన అన్ని ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా తక్షణం చెల్లించాలని కేంద్రం షరతు పెట్టింది. తమ వాటా తర్వాత ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఉంటే, ఈ ఒక్కటే కాదు అన్ని ప్రాజెక్టుల్లోనూ మీ వాటా తక్షణం ఇవ్వాలని కేంద్రం షరతు పెట్టింది. ఈ పరిస్థితుల్లో రూ.11,290 కోట్ల రోడ్ల ప్రాజెక్టులను ప్రభుత్వం ఎలా ముందడుగు వేయిస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.
3 ప్రాజెక్టుల్లో ఇవీ షరతులు
ఎన్డీబీ, ఏఐఐబీ సాయంతో చేపడుతున్న రోడ్ల అనుసంధానం, వంతెనల పునరుద్ధరణ, గ్రామీణ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి విదేశీ రుణసాయం అందించేందుకు కేంద్రం షరతులు విధించింది.
* రుణదాత రుణ మొత్తం ఇచ్చిన వెంటనే ఆ నిధులను ప్రాజెక్టు డైరెక్టర్ ఖాతాలోకి 7 పనిదినాలలోపు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి. తన వాటానూ నిర్దిష్ట గడువులోగా జమ చేయాలి.
* ఈ 3ప్రాజెక్టుల్లో పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు పరిస్థితి తదితర అంశాలను ప్రతి నెలా కేంద్రానికి, రుణమిస్తున్న ఏజెన్సీలకు తెలపాలి. వీటిని పరిశీలించి ప్రస్తుతం నిర్ణయించిన అడ్వాన్సు విధానం కొనసాగించాలా? లేదా? అన్నది డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ నిర్ణయిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్