రైతు సంస్థలకు నాబ్కిసాన్ రుణాలు
బ్యాంకుల నుంచి రుణాల విషయంలో కొన్నేళ్ల కిందట పొదుపు సంఘాలకు ఎదురైన ఇబ్బందులే ఇప్పుడు రైతు ఉత్పత్తి సంస్థలకూ వస్తున్నాయని నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల తెలిపారు. ‘అభివృద్ధి కావాలంటే రుణం తీసుకోవడం ముఖ్యం.
సరైన వ్యాపార ప్రణాళికలతో వస్తే రుణాలిస్తాం
సమ్మిళిత వ్యవసాయంతో ప్రయోజనం
నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల
ఈనాడు, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాల విషయంలో కొన్నేళ్ల కిందట పొదుపు సంఘాలకు ఎదురైన ఇబ్బందులే ఇప్పుడు రైతు ఉత్పత్తి సంస్థలకూ వస్తున్నాయని నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల తెలిపారు. ‘అభివృద్ధి కావాలంటే రుణం తీసుకోవడం ముఖ్యం. సరైన వ్యాపార ప్రణాళికలతో వస్తే.. నాబార్డు ఆధ్వర్యంలోని నాబ్ కిసాన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తాం’ అని ఆయన వివరించారు. వారాహి రైతు ఉత్పత్తి సంస్థ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించిన ఎఫ్పీవో డైరెక్టర్ల సమావేశంలో జీఆర్ చింతల, నాబ్ కిసాన్ ఎండీ సుశీల చింతల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఆర్ చింతల మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తి సంస్థలతో ఏర్పాటయ్యే సమాఖ్యలకు ఎలాంటి సాయం అందించాలనే విషయమై ఆలోచనలు చేస్తామని తెలిపారు. ‘మన భూముల్లో సేంద్రియ కర్బన శాతం తక్కువ. ఇలాగే కొనసాగితే నేల చచ్చుబడిపోతుంది. 1960-70లో కిలో యూరియాతో 14 కిలోల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తే.. ఇప్పుడు కిలో యూరియాకు 1.1 కిలోలే వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవాలి’ అని జీఆర్ చింతల సూచించారు. ‘పల్నాడులాగే ఉండే బుందేల్ఖండ్లో రైతుల వార్షికాదాయం గతంలో రూ.41వేలు ఉండేది. సమ్మిళిత వ్యవసాయ విధానంతో ఇప్పుడది రూ.3.50-4 లక్షల స్థాయికి పెరిగింది’ అని వివరించారు. రైతు ఉత్పత్తి సంస్థలకు తక్కువ వడ్డీకే రుణం అందిస్తామని నాబ్ కిసాన్ ఎండీ సుశీల చింతల తెలిపారు. ‘వడ్డీ 9% ఉంటే.. అందులో 3% రాయితీ ఉంటుంది. రైతులకు 6% వడ్డీకే రుణం లభిస్తుంది’ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లో రుణ మంజూరుకు ఎక్కువ అవకాశాలున్నాయి. రైతుల అవసరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా వచ్చే ఒకటి, రెండేళ్లలో మరిన్ని సంస్థలకు రుణం అందించేలా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. ‘ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధ పెరుగుతోంది. విజయవాడలోనే ఇప్పుడు 50 వరకు దుకాణాలు ఏర్పాటయ్యాయి’ అని గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఛైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. భారతీయ కిసాన్సంఘ్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు కుమారస్వామి, నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్ జన్నావార్ మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!