పురపాలికల్లో ఆగిన ప్రగతి
రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల్లో పూర్తిచేసిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తిచేసి 8 నుంచి 10 నెలలైనా చెల్లింపులు చేయని కారణంగా గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు.
పూర్తయిన పనులకు రూ.350 కోట్ల బిల్లుల పెండింగ్
కొత్త పనులు చేసేందుకు ముందుకురాని గుత్తేదారులు
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల్లో పూర్తిచేసిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తిచేసి 8 నుంచి 10 నెలలైనా చెల్లింపులు చేయని కారణంగా గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మొత్తం 65 పనులకు ఇప్పటికే చేసిన 35 పనులకు బిల్లులు రాలేదు. దాంతో మిగిలిన 30 పనులకు గుత్తేదారులు ముందుకు రావట్లేదు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అయితే మున్సిపల్ కార్యాలయం వద్ద బిల్లులు ఇప్పించాలంటూ ఫ్లెక్సీలు కట్టారు.
నియంత్రణ సరే... చెల్లింపులు ఏవీ?
పురపాలక సంఘాలకు పన్నులు, పన్నేతర పద్దుల కింద వచ్చే ఆదాయానికి సంబంధించిన, కేంద్ర ప్రభుత్వం కేటాయించే ఆర్థిక సంఘం నిధుల పీడీ ఖాతాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)కు అనుసంధానించాక ఇంజినీరింగ్ పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి పూర్తయిన పనుల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ఆర్థికశాఖ ఆమోదించాక గుత్తేదారుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. పురపాలక పీడీ ఖాతాల్లో నిధులున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గుత్తేదారుల్లో చాలామంది అప్పులు తెచ్చి పనులు చేస్తారు. సీఎఫ్ఎంఎస్ విధానానికి ముందు పనులు పూర్తయిన ఒకటి, రెండు నెలల్లో బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. దీంతో అప్పులకు వడ్డీలు భారీగా పెరిగాయని గుంటూరు జిల్లాకు చెందిన గుత్తేదారు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే పనికి రెండు, మూడుసార్లు టెండర్లు
సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారులు ముందుకు రానందున కొన్ని పురపాలక సంఘాల్లో ఒకే పనికి రెండు, మూడుసార్లు టెండర్లు పిలుస్తున్నారు. శ్రీకాకుళం, ఉభయగోదావరి, ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల్లో గుత్తేదారులను టెండర్లు వేయాలని ఇంజినీర్లు బతిమాలుతున్నారు. పాత పనులకు బిల్లులు చెల్లించకపోతే కొత్త పనులు చేసేందుకు పెట్టుబడులెలా వస్తాయని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్కు పీడీ ఖాతాలు అనుసంధానించాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎవరికీ చెప్పుకోలేకపోతున్నామని పురపాలక సంఘ కమిషనర్ ఒకరు అన్నారు. గుత్తేదారులకు పాత బిల్లులిప్పిస్తామని హామీ ఇస్తున్నా... తమకు నమ్మకం లేదంటూ టెండర్లు వేయడం లేదని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు