‘ఎన్టీఆర్‌ జిల్లా’ను స్వాగతిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్‌ జిల్లాని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది తెలుగువాళ్లు గర్వపడే నిర్ణయమని

Published : 28 Jan 2022 02:59 IST

నందమూరి రామకృష్ణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్‌ జిల్లాని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది తెలుగువాళ్లు గర్వపడే నిర్ణయమని ఆయన సంతోషం వెలిబుచ్చారు. తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైనా తెలుగు బిడ్డలం మనందరం ఒక్కటేనని చాటి చెప్పి ..తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన యుగ పురుషుడు ఎన్టీఆర్‌ అని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు.

తెలంగాణలో కూడా ఏర్పాటుచేయాలి: దర్శకుడు వైవీఎస్‌ చౌదరి
తెలుగు ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడ ముఖ్య కేంద్రంగా ఎన్టీఆర్‌ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంపై దర్శకనిర్మాత వై.వి.ఎస్‌.చౌదరి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటుపై కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటిస్తుందని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని