AP PRC: ఎంత చేయగలమో అంత చేశాం
మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. మీ సమస్యలను అనామలీస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
మీరు లేకపోతే నేను లేను
మీ సమస్యలేవైనా ప్రభుత్వం దృష్టికి తేవొచ్చు : ముఖ్యమంత్రి జగన్
ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి జగన్
మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. మీ సమస్యలను అనామలీస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
- ఉద్యోగ నేతలతో సీఎం
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు బాగా పడిపోయాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 2018-19లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 15 శాతం పెరిగి 2019-20 నాటికి రూ.72 వేల కోట్లు రావాల్సి ఉండగా... రూ.60 వేల కోట్లకు పడిపోయిందని చెప్పారు. 2020-21లో రూ.84 వేల కోట్లు రావాల్సి ఉన్నా రూ.60 వేల కోట్లతోనే ఆగిపోయింది తప్ప పెరగలేదని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించి, మీరు ఆశించినంత ఇవ్వలేకపోయినా మనసా, వాచా, కర్మణా ఎంత మేర మేలు చేయగలమో అంత చేశామని పేర్కొన్నారు. శనివారం రాత్రి మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలమైన నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నాయకులు పలువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతోనే మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మీ పక్షాన నిలబడటానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నా. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. రాజకీయాలకు తావుండకూడదు. మీ సమస్యలను అనామలీస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. వారికీ చెప్పొచ్చు. పరిస్థితులు ఇలా ఉండకపోయుంటే మిమ్మల్ని మరింత సంతోషపెట్టేవాణ్ని. మీరంతా నా దగ్గరకు సంతోషంగా వచ్చేవారు. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి లేదు’ అని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏటా రూ.11,577 కోట్ల భారం
ఉద్యోగ సంఘాలతో శనివారం జరిగిన చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతోనూ సంప్రదింపుల్లో ఉంది. నా ఆమోదంతోనే నిర్ణయాల్ని మంత్రుల కమిటీ మీకు చెప్పింది. అవి మీకు సంతృప్తినిచ్చినందుకు సంతోషం. 30 నెలల పాటు ఐఆర్ ఇచ్చాం. అందులో 9 నెలల ఐఆర్ను సర్దుబాటు నుంచి మినహాయించడం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్ల అదనపు భారం పడుతోంది. హెచ్ఆర్ఏను జనవరి నుంచి వర్తింపజేయటం వల్ల మరో రూ.325 కోట్లు భరించాలి. మొత్తంగా రూ.5,725 కోట్లు అవుతుంది. హెచ్ఆర్ఏ, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, సీసీఏల మార్పు వల్ల ఏటా రికరింగ్ వ్యయం రూపేణా రూ.1,330 కోట్ల మేర ప్రభుత్వం భరించాలి. వీటన్నింటి వల్ల రూ.11,577 కోట్ల మేర ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాది రికరింగ్ భారం పడుతుంది. ముందు ప్రకటించిన పీఆర్సీ ప్రకారం ఇది రూ.10,247 కోట్లే. ఆర్థిక పరిస్థితులు మీకు తెలియాలనే ఇవన్నీ వివరిస్తున్నా. ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్లు అందరికీ వేతనాలు పెంచాం. వీటివల్ల 2018-19 నాటికి రూ.52 వేల కోట్లుగా ఉన్న వేతనాల బిల్లు ఈ సంవత్సరం రూ.67 వేల కోట్లకు పెరిగింది. తాజాగా దీనికి మరో రూ.11 వేల కోట్లు అదనం కానుంది.
సీపీఎస్పై అధ్యయనం చేస్తున్నాం
సీపీఎస్పై గట్టిగా పనిచేస్తున్నాం. వివరాలన్నీ ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను. మిమ్మల్నందర్నీ అందులో మమేకం చేస్తాను. కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పింఛను మంచిగా పెరిగేలా చూస్తాను. గతంలో ఎవరూ చేయని విధంగా ఉద్యోగికి జగన్ మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. పదవీ విరమణ తర్వాత కూడా మంచి జరగాలని ఆలోచిస్తున్నా. సీపీఎస్లో ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నాం. ఒప్పంద ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వనున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తాం. సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. మున్ముందు ఇవన్నీ మంచి ఫలితాలనిస్తాయి. అందరం కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం.
నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు
నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. ఎక్కడైనా తక్కువ చేస్తున్నామని అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. 24 నెలలు జీతం రూపేణా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని గుర్తుంచుకోండి. ఏ సమస్యపైనైనా చర్చించేందుకు, మీరు చెప్పేవి వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చర్చల ద్వారా పరిష్కారం కానప్పుడు మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.