AP PRC: ఎంత చేయగలమో అంత చేశాం
మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. మీ సమస్యలను అనామలీస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
మీరు లేకపోతే నేను లేను
మీ సమస్యలేవైనా ప్రభుత్వం దృష్టికి తేవొచ్చు : ముఖ్యమంత్రి జగన్
ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి జగన్
మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. మీ సమస్యలను అనామలీస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
- ఉద్యోగ నేతలతో సీఎం
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు బాగా పడిపోయాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 2018-19లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 15 శాతం పెరిగి 2019-20 నాటికి రూ.72 వేల కోట్లు రావాల్సి ఉండగా... రూ.60 వేల కోట్లకు పడిపోయిందని చెప్పారు. 2020-21లో రూ.84 వేల కోట్లు రావాల్సి ఉన్నా రూ.60 వేల కోట్లతోనే ఆగిపోయింది తప్ప పెరగలేదని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించి, మీరు ఆశించినంత ఇవ్వలేకపోయినా మనసా, వాచా, కర్మణా ఎంత మేర మేలు చేయగలమో అంత చేశామని పేర్కొన్నారు. శనివారం రాత్రి మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలమైన నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నాయకులు పలువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతోనే మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మీ పక్షాన నిలబడటానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నా. ఈ వ్యవహారంలోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. రాజకీయాలకు తావుండకూడదు. మీ సమస్యలను అనామలీస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. వారికీ చెప్పొచ్చు. పరిస్థితులు ఇలా ఉండకపోయుంటే మిమ్మల్ని మరింత సంతోషపెట్టేవాణ్ని. మీరంతా నా దగ్గరకు సంతోషంగా వచ్చేవారు. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి లేదు’ అని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏటా రూ.11,577 కోట్ల భారం
ఉద్యోగ సంఘాలతో శనివారం జరిగిన చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతోనూ సంప్రదింపుల్లో ఉంది. నా ఆమోదంతోనే నిర్ణయాల్ని మంత్రుల కమిటీ మీకు చెప్పింది. అవి మీకు సంతృప్తినిచ్చినందుకు సంతోషం. 30 నెలల పాటు ఐఆర్ ఇచ్చాం. అందులో 9 నెలల ఐఆర్ను సర్దుబాటు నుంచి మినహాయించడం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్ల అదనపు భారం పడుతోంది. హెచ్ఆర్ఏను జనవరి నుంచి వర్తింపజేయటం వల్ల మరో రూ.325 కోట్లు భరించాలి. మొత్తంగా రూ.5,725 కోట్లు అవుతుంది. హెచ్ఆర్ఏ, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, సీసీఏల మార్పు వల్ల ఏటా రికరింగ్ వ్యయం రూపేణా రూ.1,330 కోట్ల మేర ప్రభుత్వం భరించాలి. వీటన్నింటి వల్ల రూ.11,577 కోట్ల మేర ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాది రికరింగ్ భారం పడుతుంది. ముందు ప్రకటించిన పీఆర్సీ ప్రకారం ఇది రూ.10,247 కోట్లే. ఆర్థిక పరిస్థితులు మీకు తెలియాలనే ఇవన్నీ వివరిస్తున్నా. ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్లు అందరికీ వేతనాలు పెంచాం. వీటివల్ల 2018-19 నాటికి రూ.52 వేల కోట్లుగా ఉన్న వేతనాల బిల్లు ఈ సంవత్సరం రూ.67 వేల కోట్లకు పెరిగింది. తాజాగా దీనికి మరో రూ.11 వేల కోట్లు అదనం కానుంది.
సీపీఎస్పై అధ్యయనం చేస్తున్నాం
సీపీఎస్పై గట్టిగా పనిచేస్తున్నాం. వివరాలన్నీ ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను. మిమ్మల్నందర్నీ అందులో మమేకం చేస్తాను. కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పింఛను మంచిగా పెరిగేలా చూస్తాను. గతంలో ఎవరూ చేయని విధంగా ఉద్యోగికి జగన్ మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. పదవీ విరమణ తర్వాత కూడా మంచి జరగాలని ఆలోచిస్తున్నా. సీపీఎస్లో ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నాం. ఒప్పంద ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వనున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తాం. సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. మున్ముందు ఇవన్నీ మంచి ఫలితాలనిస్తాయి. అందరం కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం.
నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు
నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. ఎక్కడైనా తక్కువ చేస్తున్నామని అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. 24 నెలలు జీతం రూపేణా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని గుర్తుంచుకోండి. ఏ సమస్యపైనైనా చర్చించేందుకు, మీరు చెప్పేవి వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చర్చల ద్వారా పరిష్కారం కానప్పుడు మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..