AP News: ఏపీకి సహకరిస్తాం
ఆంధ్రప్రదేశ్కు తమ వంతు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్ పేర్కొన్నారు. విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోయినందున ఆదాయం తగ్గిందన్న విషయం తమకు తెలుసని, రెవెన్యూ లోటు పూడ్చేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు
రెవెన్యూ లోటు భర్తీకి యత్నం
పోలవరం ఎత్తుపై మరోసారి అధ్యయనం చేస్తే మేలు
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్
సీఎం జగన్తో భేటీ
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు తమ వంతు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్ పేర్కొన్నారు. విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోయినందున ఆదాయం తగ్గిందన్న విషయం తమకు తెలుసని, రెవెన్యూ లోటు పూడ్చేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ బృందం ప్రతినిధులు.. తొలిరోజు బుధవారం రాత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. వైస్ ఛైర్మన్ రాజీవ్కుమార్, ప్రత్యేక కార్యదర్శి కె.రాజేశ్వరరావు, ఇతర సభ్యులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జెన్కో, డిస్కమ్లకు ఆర్థిక సహాయం సహా పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయి
‘రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయం. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ ప్రక్రియలు, దిశ యాప్ తదితరాలు బాగున్నాయి. కొవిడ్తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేసే విధానంతో పాటు దిశ యాప్ను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచిస్తాం. సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో చేస్తోంది’ అని వైస్ ఛైర్మన్ రాజీవ్కుమార్ అభినందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం కోరగా.. ఇందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని బదులిచ్చారు. రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్రంతో పరస్పర సహకారంతో మెలగాలని, సమాఖ్య స్ఫూర్తి కొనసాగేలా కృషిచేస్తామని చెప్పారు. తీరప్రాంతంలో ఆర్థిక, పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయాలని, పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని సూచించారు.
అధికారులు ఏం వివరించారంటే..
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్తు బకాయిలు ఇప్పించాలని అధికారులు నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు. రీసోర్స్ గ్యాప్ కింద కాగ్ నిర్ధారించిన మేరకు రూ.18,969 కోట్ల నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.
- ఆర్బీకేల ద్వారా సేంద్రియ పంటల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, రైతులకు మంచి ఆదాయం వస్తుందని రాజీవ్కుమార్ సూచించగా.. ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి పథకాల అమలు తీరును వివరించారు.
- అంగన్వాడీలతో పాటు పాఠశాలలను ఆరు అంచెలుగా విభజించామని, సబ్జెక్టుల వారీగా బోధన, పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడాన్ని సీఎం స్వయంగా వివరించారు. ఆసరా, చేయూత ఉద్దేశాలను, సుస్థిర ఆర్థిక ప్రగతికి అమలు చేస్తున్న ఉపాధి కార్యక్రమాలను జగన్ ప్రస్తావించారు.
ప్రకృతి సేద్యానికి కేంద్రం ప్రాధాన్యం
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: ప్రకృతి సేద్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, రైతులు దీన్ని అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్కుమార్ సూచించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ గ్రామాన్ని ‘సేంద్రియ వ్యవసాయానికి తీర్థయాత్ర క్షేత్రం’గా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామన్నారు. యువరైతు బత్తుల సతీష్రెడ్డి సేంద్రియ సేద్యం పద్ధతులను చూసి అభినందించారు. దేవిరెడ్డి ముత్తారెడ్డి మామిడి తోటలను పరిశీలించారు. గ్రామ, వార్డు సచివాలయాలను, ఆర్బీకేలను పరిశీలించారు. పొదుపు సంఘాల రైతులతో మాట్లాడి, మిద్దె, పెరటి తోటల పెంపకం చేపట్టిన మహిళలను ప్రశంసించారు.
పారిశ్రామిక వర్గాలతో భేటీ
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని వినియోగించుకొని పరిశ్రమలు అభివృద్ధి చెందాలని రాజీవ్కుమార్ సూచించారు. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి 13 రంగాల్లో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలు, సంఘాల ప్రతినిధులతో సాయంత్రం నీతిఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడం, నిబంధనలు సరళీకరించడం ద్వారా సులభతర వాణిజ్యం అమలులో ముందున్నామని అధికారులు వివరించారు. ఈ బృందంలో నీతిఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వరరావు, సలహాదారులు నీలం పటేల్, అవినాశ్ మిశ్ర, సీహెచ్పీ.సారథిరెడ్డి, సుజిత్జైన్, మన్ప్రీత్కౌర్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.