APS RTC:ఆర్టీసీ భవిష్యనిధిపై సర్కారు కన్ను!
ఏపీఎస్ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే
పీఎఫ్ ట్రస్టులో రూ.1,600 కోట్లు
స్టేట్ ఫైనాన్సియల్ సర్వీస్
కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని సంప్రదింపులు
కుదరదంటున్న ఆర్టీసీ అధికారులు
ఈనాడు, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు. ఇందుకు నిబంధనలు అంగీకరించవని బదులిస్తున్నట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులు, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలను.. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలంటూ సంప్రదింపులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీని కూడా పీఎఫ్ ట్రస్టు నిధుల కోసం కోరుతున్నారని తెలిసింది.
ఉద్యోగుల పీఎఫ్ను సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా ట్రస్టు ఏర్పాటుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) గతంలో మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (బేసిక్, డీఏ) నుంచి 12 శాతం ప్రతి నెలా రికవరీ చేస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం (ప్రస్తుతం ప్రభుత్వం) వాటాగా ఇస్తుంది. యాజమాన్య వాటా నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎఫ్-95 పింఛను పథకం కోసం ఈపీఎఫ్వోకు ఇస్తారు. మిగిలినదంతా ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టులోనే ఉంటుంది. ఇలా ట్రస్టులో ప్రస్తుతం పద్దుల ప్రకారం దాదాపు రూ.2 వేల కోట్లు ఉండాలి. గతంలో ఆర్టీసీ యాజమాన్యం జీతాల సర్దుబాటు సమయంలో పీఎఫ్ వాటాను ట్రస్టుకు సకాలంలో జమ చేయలేదు. వీటిని ఆర్టీసీ వాడుకుంది. ఈ మొత్తం రూ.850 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో కొంత కాలం కిందట ఆర్టీసీ రూ.450 కోట్లు ట్రస్టుకు జమ చేయగా, ఇంకా రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పీఎఫ్ ట్రస్టులో ప్రస్తుతం రూ.1,600 కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
ప్రత్యేక నిబంధనలు అడ్డు..
ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు నిధులను, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయడానికి నిబంధనలు అంగీకరించవని ఆర్టీసీ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దేశిత పథకాలు, సంస్థల్లో మాత్రమే వీటిని పెట్టుబడులు పెట్టాలని, వాటిలోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. వీటికి లాక్ పీరియడ్ ఉంటుందని, మధ్యలో తీసేందుకు వీలుండదని స్పష్టం చేశారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం