Azadi Ka Amrit Mahotsav: జలియన్వాలాబాగ్ను జగానికి తెలిపాడని...
భారత్లో బ్రిటిష్ ప్రభుత్వ అరాచకాలపై నల్ల జెండాలెత్తిన వారిలో కొందరు తెల్లవారూ ఉన్నారు. వారిలో అత్యంత ప్రభావం చూపిన... ఇంగ్లాండ్లోని సామాన్య బ్రిటిషర్లనూ ఆలోచనలో పడేసిన... ఇంటాబయటా బ్రిటిష్ సర్కారును దోషిగా నిలబెట్టిన... అరుదైన కలం యోధుడు బి.జి.హార్నిమన్! ఆంక్షలను బేఖాతరు చేస్తూ
భారత్లో బ్రిటిష్ ప్రభుత్వ అరాచకాలపై నల్ల జెండాలెత్తిన వారిలో కొందరు తెల్లవారూ ఉన్నారు. వారిలో అత్యంత ప్రభావం చూపిన... ఇంగ్లాండ్లోని సామాన్య బ్రిటిషర్లనూ ఆలోచనలో పడేసిన... ఇంటాబయటా బ్రిటిష్ సర్కారును దోషిగా నిలబెట్టిన... అరుదైన కలం యోధుడు బి.జి.హార్నిమన్! ఆంక్షలను బేఖాతరు చేస్తూ... అత్యంత దారుణమైన మారణకాండను ప్రపంచానికి చాటిన ఈ పాత్రికేయుడిని ఏమీ చేయలేక ఓడెక్కించి లండన్ పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం! కానీ ఆయన దొడ్డిదారిన మళ్లీ వచ్చి స్వతంత్ర భారత్లో కన్నుమూశారు.
అనిబిసెంట్లాంటి వారిలా సామాన్య ప్రజలకు పరిచయం లేని పేరు హార్నిమన్. కానీ భారత స్వాతంత్య్రం కోసం, భారత్లో పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషి అసామాన్యం! తన రాతలతో కొరకరాని కొయ్యలా మారిన... ఆయన్ను వదలించుకోవటానికి ఆంగ్లేయ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంగ్లాండ్లో పాత్రికేయుడిగా ప్రస్థానం ఆరంభించిన హార్నిమన్ 1906లో కోల్కతాలోని స్టేట్స్మన్ పత్రికకు న్యూస్ ఎడిటర్గా భారత్లో అడుగుపెట్టారు. రాగానే తమ తెల్లవారి దాష్టీకాలను అర్థం చేసుకున్న ఆయన... భారతీయుల పక్షాన నిలబడ్డారు. బెంగాల్ విభజనను నిరసిస్తూ ఉద్యమంలో పాల్గొన్నారు. 1913లో ముంబయి క్రానికల్ పత్రికకు ఎడిటర్గా ముంబయికి మారారు. అప్పటిదాకా సంపన్నవర్గాల వార్తలే ప్రచురించే పత్రికలో... సామాన్యులకూ స్థానమిచ్చి వారి సమస్యలను లేవనెత్తేవారు. ప్రభుత్వ తీరును ఎండగట్టడమేగాకుండా... స్థానికులను దోచుకుంటున్నారంటూ భారత్లోని ఆంగ్లవ్యాపారుల తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించేవారు. దీంతో... ఆంగ్లేయ అధికారులకు, వ్యాపారులకు హార్నిమన్ శత్రువుగా మారారు. భారత్లో పత్రికా స్వేచ్ఛను కోరుతూ... ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను ఆరంభించారు. 1919లో గాంధీ పిలుపు మేరకు రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్న ఆయన... జలియన్వాలాబాగ్ ఘటన తర్వాత పాత్రికేయుడిగా తన విశ్వరూపం ప్రదర్శించారు.
1919 ఏప్రిల్లో జరిగిన జలియన్వాలాబాగ్ ఊచకోతను ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పత్రికల్లో వార్తలు, ఫొటోలు రాకుండా ఆంక్షలు విధించింది. కానీ మార్షల్లా ఆంక్షలను తోసిరాజంటూ... తమ స్థానిక విలేకరి లాలా గోవర్ధన్దాస్ ప్రత్యక్షంగా అందించిన వివరాలను హార్నిమన్ ముంబయి క్రానికల్లో ప్రచురించారు. ఇంగ్లాండ్కూ పంపించారు. రహస్యంగా ఫొటోలను సైతం లండన్కు చేరవేశారు. అక్కడి ది డైలీ హెరాల్డ్లో ఈ ఊచకోత ఫొటోలు, వార్తలు రావటంతో యావత్ ప్రపంచానికి భారత్లో ఆంగ్లేయుల దారుణం కళ్లకు కట్టినట్లు తెలిసిపోయింది. కథనం రాసిన గోవర్ధన్దాస్ను అరెస్టు చేసి మూడేళ్లు జైలుకు పంపిన బ్రిటిష్ ప్రభుత్వం... తమ వాడైన హార్నిమన్ను ఏమీ చేయలేకపోయింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా... బలవంతంగా ఓడెక్కించి లండన్కు తిరిగి పంపించేసింది.
అక్కడికి వెళ్లినా భారత తరఫున పోరాటాన్ని విడిచిపెట్టలేదాయన. జలియన్వాలాబాగ్ ఊచకోతకు కారణమైన డయ్యర్ తీరును తప్పుపట్టిన హార్నిమన్ తన దేశవాసులను పునరాలోచించేలా కథనాలు రాశారు.
భారత్కు తిరిగి వచ్చేందుకు ఆయన ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో... 14 సంవత్సరాల తర్వాత ఓరోజు లండన్ నుంచి కొలంబోకు చేరుకున్న ఆయన... అక్కడి నుంచి భారత్కు వచ్చారు. కోర్టు సమర్థించడంతో ప్రభుత్వం ఏమీచేయలేక పోయింది. అలా ఇక్కడే ఉండిపోయిన హార్నిమన్ భారత స్వాతంత్య్ర ఆవిర్భావానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. 1941లో కరంజియా, దిన్కర్ నాద్కర్ణిలతో కలసి తొలి వీక్లీ టాబ్లాయిడ్ ‘బ్లిట్జ్’ను స్థాపించిన ఈ ఆంగ్లేయుడు భారతీయుడిగా 1948 అక్టోబరులో కన్నుమూశారు. ‘‘భారత్కు స్వాతంత్య్ర మంత్రం నేర్పిన ఉదాత్త ఆంగ్లేయుడు హార్నిమన్. ఆయన సేవల్ని భారత్ ఎన్నటికీ మరచిపోలేదు’’ అని గాంధీజీ కొనియాడారు.
మన ఆంగ్లేయ అధికారులు అపరిమిత అధికారాలతో భారత్లో పాల్పడుతున్న తీవ్రవాద చర్యలను చూసి కూడా మౌనంగా ఉంటే... న్యాయాన్ని గౌరవించే వారమని మనం ఎలా చెప్పుకోగలం? మానవత, ప్రేమ మనలో ఉన్నాయని ఎలా అనుకోగలం?’’
అని ఇంగ్లాండ్ ప్రజల్లో హార్నిమన్ ఆలోచన రేకెత్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్