ఎంపీలాడ్స్ పథకం పునఃప్రారంభం
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులను (ఎంపీల్యాడ్స్ను) కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిధులను రెండేళ్ల పాటు కరోనా నియంత్రణ
ఈ సంవత్సరం రూ.2 కోట్లు.. వచ్చే ఏడాది నుంచి రూ.5 కోట్లు
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
నిర్ణయాలను వెల్లడిస్తున్న అనురాగ్ ఠాకూర్
ఈనాడు, దిల్లీ: పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులను (ఎంపీల్యాడ్స్ను) కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిధులను రెండేళ్ల పాటు కరోనా నియంత్రణ చర్యలకు వినియోగించాలని యోచించి, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొంది. తక్షణమే ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రధాని మోదీ ఆధ్వర్యాన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఎంపీ రూ.2 కోట్లను తన నియోజకవర్గ పరిధిలో జరిగే విభిన్న పనులకు కేటాయించేందుకు అనుమతిచ్చింది. 2022-23 నుంచి 2025-26 వరకూ ఏటా మునుపటి మాదిరే రూ.5 కోట్లు వాడుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్సింగ్ ఠాకుర్ విలేకరులకు వెల్లడించారు. దీనివల్ల 2021-22లో ఎంపీల్యాడ్స్ పథకం కింద రూ.1,584 కోట్లు; 2022-23 నుంచి 2025-26 వరకూ మరో రూ.15,833 కోట్లు ఖర్చుచేసే వీలుంటుందన్నారు. నాలుగేళ్లలో మొత్తం రూ.17,417 కోట్లు ఈ పథకానికి సమకూరుతాయన్నారు. కరోనా నియంత్రణలోకి రావడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, పన్నుల రాబడి ఆశాజనకంగా ఉండటంతో ఎంపీలకు ఈ నిధులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఠాకుర్ తెలిపారు.
సీసీఐకి రూ.17,408.85 కోట్లు
పత్తిని కనీస మద్దతుధరకు కొనుగోలు చేయడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు రూ.17,408.85 కోట్లు ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. దీనిద్వారా 11 రాష్ట్రాల్లోని 60 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని అనురాగ్ ఠాకుర్ చెప్పారు.
* ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి వచ్చే ఏడాది నవంబరు 30 వరకూ వర్తించేలా ఇథనాల్ ధరలను నిర్ణయించారు. ఇదివరకు ఇథనాల్ మిశ్రమ పథకం కింద 2025 నాటికి పెట్రో ఉత్పత్తుల్లో 10% ఇథనాల్ కలపాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు మిశ్రమశాతాన్ని 20కి పెంచింది. చక్కెర మిల్లుల్లో ఉత్పత్తి అయ్యే సీ-హెవీ మొలాసిస్ ధరను లీటరుకు రూ.45.69 నుంచి రూ.46.66కి, బి-హెవీ మొలాసిస్ ధరను రూ.57.61 నుంచి రూ.59.08కి, చెరకు రసం నుంచి తయారుచేసే మొలాసిస్ ధరను రూ.62.65 నుంచి రూ.63.45కి పెంచాలని నిర్ణయించింది.
ఏటా నవంబరు 15న గిరిజన గౌరవ దినోత్సవం
స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని (నవంబరు 15) ఇక నుంచి ఏటా గిరిజన గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. గిరిజన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తిస్తూ... నవంబరు 15 నుంచి 22 వరకూ ‘గిరిజన ఉత్సవాలు’ నిర్వహించనున్నట్టు ఠాకుర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.