Chandrababu: క్లెమోర్మైన్స్ పేలుళ్లకూ చలించని నేత
మావోయిస్టులు క్లెమోర్ మైన్స్తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు.
అవమానభారంతో కన్నీరు మున్నీరైన వేళ
ఈనాడు, అమరావతి: మావోయిస్టులు క్లెమోర్ మైన్స్తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన కన్నీరు పెట్టడం సహచరులెవరూ చూడలేదు. శుక్రవారం శాసనసభలో జరిగిన అవమానంతో చలించిపోయి తెదేపా అధినేత చంద్రబాబు రోదించారు. శాసనసభ ఆయనకు కొత్తకాదు. సభలో ఆవేశకావేశాలు, రాజకీయ విమర్శలు, ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితులూ కొత్తకాదు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ఎందరో నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. దీటుగా నిలబడ్డారు. కానీ నిండుసభలో... వైకాపా ఎమ్మెల్యేలు తన భార్యపై వ్యక్తిత్వ హననానికి పాల్పడం, ఆమెను కించపరిచేలా అత్యంత అవమానకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్రంగా కుంగిపోయారు.
కట్టలు తెగిన ఆవేదన
అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై సభలో వాగ్వాదం జరిగాక స్పీకర్ సభను వాయిదా వేయడంతో చంద్రబాబు తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నారు. ఆప్పటికే ఆయన ముఖం అవమానభారంతో ఎరుపెక్కింది. అప్పటికీ ఉబికివస్తున్న దుఃఖాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కాసేపు యాంటీరూమ్లోకి వెళ్లి వచ్చారు. చంద్రబాబును చూస్తూనే శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు... ఆయన కాళ్లకు నమస్కరించి, కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ సహచరుల్ని చూశాక చంద్రబాబు అంతరంగంలో సుడులు తిరుగుతున్న బాధ ఆగలేదు. వారి ముందే భోరున విలపించారు. అంత అవమానం జరిగాక... ఇక సభలోకి అడుగు పెట్టకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. సభలోనే తన ఆవేదన వెల్లడించి... బయటకు వచ్చేయాలన్న ఉద్దేశంతో మళ్లీ సభలోకి వెళ్లారు. స్పీకర్ మైక్ ఇచ్చారు. చంద్రబాబు తన ఆవేదన తెలియజేస్తున్నా... అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పూర్తిగా మాట్లాడక ముందే... స్పీకర్ మైక్ కట్ చేయడంతో, ఆయన తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి అవమానభారంతో నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక పదేపదే భోరున విలపించారు.
చెక్కుచెదరని ధైర్యం చలించిన వేళ..
దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి... పిన్న వయసులోనే మంత్రిగా, నాలుగు పదుల వయసులోనే ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర రాజకీయాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించిన నేపథ్యం చంద్రబాబుది. ఆ ప్రస్థానంలో ఆయన అనేక ఎదురుదెబ్బలూ తిన్నారు. అయినా ఎప్పుడూ చలించలేదు. 1983లో చంద్రగిరిలో ఓడిపోవడం ఆయనకు రాజకీయంగా తగిలిన మొదటి ఎదురుదెబ్బ. తర్వాత అనేక ఆటుపోట్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. 1989లో పార్టీ ఓడిపోయినా... డీలా పడకుండా, మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకూ అవిశ్రాంత పోరాటం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనప్పుడూ పోరాటం ఆపలేదు. ఆరు పదుల వయసులోనూ సుదీర్ఘ పాదయాత్ర చేసి... పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2003లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... తిరుపతిలో అలిపిరి వద్ద మావోయిస్టులు క్లెమోర్మైన్స్ పేల్చినప్పుడు తీవ్రంగా గాయపడ్డా ఆయన భయపడలేదు. కంటి నుంచి చుక్క నీరు రాలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడూ ఆయన కుంగిపోలేదు. వెంటనే తేరుకుని మళ్లీ పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వ నిర్బంధాల్ని, ఆంక్షల్ని, పార్టీ నాయకులపై పెడుతున్న కేసుల్ని, కార్యకర్తలపై వేధింపుల్ని తట్టుకుని నిలబడ్డారు. చివరకు పార్టీ కేంద్ర కార్యాలయంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినా చలించలేదు. అలాంటి నాయకుడు... శాసనసభలో జరిగిన అవమానంతో పొగిలి పొగిలి ఏడవడంతో ఆయన సహచరులు, పార్టీ నాయకులు చలించిపోయారు.
పార్టీ కార్యాలయంలో ఉద్విగ్న వాతావరణం
విలేకరుల సమావేశంలో చంద్రబాబు విలపించడాన్ని టీవీల్లో చూసి తీవ్ర ఆవేదనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన తెదేపా కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పార్టీ నాయకులు కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, నక్కా ఆనంద్బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాస్ తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని అధినేతతో సమావేశమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై... కార్యకర్తలు నిరసన తెలియజేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో... వైకాపా జెండాలు, ఆ పార్టీ నాయకుల చిత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!