Aarogyasri: ఆరోగ్యశ్రీలోకి మరిన్ని చికిత్సలు
వైద్యులు, అధికారులు సూచిస్తే ఆరోగ్యశ్రీ పరిధిలోనికి మరిన్ని చికిత్సలను తెచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 1,096 చికిత్సలు అందుబాటులో ఉండగా వాటిని తాము 2,446కు పెంచామన్నారు.
తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం
వైద్యులు, అధికారులు సూచించాలి
29 నెలల్లో రూ.4వేల కోట్ల వ్యయం
శాసనసభలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: వైద్యులు, అధికారులు సూచిస్తే ఆరోగ్యశ్రీ పరిధిలోనికి మరిన్ని చికిత్సలను తెచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 1,096 చికిత్సలు అందుబాటులో ఉండగా వాటిని తాము 2,446కు పెంచామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా గడిచిన 29 నెలల్లో రూ.4వేల కోట్లు వ్యయం చేశామని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో గురువారం ‘ఆరోగ్య రంగం’పై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. ‘మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వమిది. వార్షిక పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం. రూ.1,000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది. సుమారు రూ.10లక్షల ఖరీదైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్, మూగ, చెవిటి పిల్లల కోసం రూ.12 లక్షల ఖరీదైన బైకాంక్లియర్ ఆపరేషన్, రూ.11 లక్షల ఖరీదైన గుండె మార్పిడి, రూ.9 లక్షల వరకు వ్యయమయ్యే స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను కూడా అందిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లోని 130 సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల్లో పేదలు వైద్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించాం. కొవిడ్ బాధితులకు ఉచితంగా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందిస్తూ పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాం.బిల్లులు పంపిన 21 రోజులకు అనుబంధ ఆసుపత్రులకు చెల్లింపులు జరిగేలా సీఎం కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తోంది. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ‘ఆసరా’ కింద ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నాం...’’ అని సీఎం జగన్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సేవల కొనసాగింపులో కత్తిరింపులు ఉండేవన్నారు.
వచ్చే నెలాఖరుకి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్!
రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వచ్చే నెలాఖరు(డిసెంబరు) నాటికి తొలి విడత కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ‘‘రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 87% మందికి ఒక డోసు వ్యాక్సిన్ అందించాం. రానున్న మార్చి నాటికి 2 డోసుల పంపిణీ పూర్తవుతుంది. కొవిడ్ మరణాల రేట్ రాష్ట్రంలో 0.70% మాత్రమే. కొవిడ్ వచ్చిన 99.3% మందిని కాపాడుకున్నాం. వైద్య సిబ్బంది 31సార్లు ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య లక్షణాల గురించి వివరాలు సేకరించారు...’’ అని పేర్కొన్నారు.
రూ.16,255 కోట్లతో నాడు-నేడు పనులు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేసి, సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకురాబోతున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ‘‘గిరిజన ప్రాంతాల్లో సైతం బోధనాసుపత్రి కొత్తగా రాబోతుంది. ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు కూడా వస్తున్నాయి. రూ.16,255 కోట్లతో నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటివరకు 9,712 వైద్యులు, ఇతర పోస్టులు, 15వేల ఎ.ఎన్.ఎం. పోస్టులు భర్తీ చేశాం. కొత్తగా మళ్లీ 14,788 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తాం. కేవలం ఆరోగ్య శాఖలోనే 40వేల వరకు పోస్టులు భర్తీ అవుతున్నాయి. 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేశాం. గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకువస్తున్నాం. కొత్తగా 400కు (104)పైగా అంబులెన్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా 66 లక్షల మందికి పిల్లలకు పరీక్షలు చేశాం. 3 ప్రాంతాల్లో ఛైల్డ్కేర్ ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ఆసక్తి ఉన్న సంస్థలకు ఉచితంగా భూమి అందజేసి, సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల ఏర్పాటు జరిగేలా కృషి చేస్తున్నాం. వీటిల్లో 50% పడకలు ఆరోగ్యశ్రీ కింద కేటాయిస్తారు. వైద్య రంగంలో తీసుకువస్తున్న చర్యల వల్ల రానున్న 6 నెలల్లో మంచి సంస్కరణలు అమల్లోనికి వస్తాయి...’’ అని సీఎం జగన్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం