వీడని వరద భయం
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను వర్షాల భయం వెన్నాడుతూనే ఉంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను వెన్నాడుతున్న వర్షాలు
లోతట్టు ప్రాంతాల మునక
రాకపోకలకు అంతరాయం
ఈనాడు డిజిటల్, నెల్లూరు, చిత్తూరు-న్యూస్టుడే, ఒంగోలు: నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను వర్షాల భయం వెన్నాడుతూనే ఉంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కండలేరు జలాశయం ఎనిమిదో కి.మీ.కట్ట వద్ద మట్టి జారిపోయింది. జలాశయంలోని నీటిని నల్లవాగు మీదుగా పెన్నాకు వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. చేజర్ల, కలువాయి మండలాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం ఉదయం 8.30నుంచి సోమవారం వరకు జిల్లాలో సగటున 10.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెం.మీ, చిల్లకూరులో 19.9 సెం.మీలు కురిసింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిలకు వరద వస్తుండటంతో 12 గేట్ల ద్వారా దిగువకు 1.16 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉదయగిరి మండలం గండిపాళెం జలాశయం మూడు గేట్లు ఎత్తి దిగువకు 10,500 క్యూసెక్కులు, వాకాడు బ్యారేజీ 16గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దీంతో ఉప్పువాగు ప్రవహిస్తుండటంతో 30 తీర ప్రాంత గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వెంకటగిరిలో ఎర్రచెరువు పొంగి బీసీ కాలనీ ఇళ్లలోకి నీరు చేరింది. సైదాపురం మండలం మర్లపూడి సమీపంలో తెలుగుగంగ 2బీ ఉపకాలువకు గండి పడింది. గూడూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మనుబోలు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద జాతీయ రహదారిపై నీరు ప్రవహించి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. నెల్లూరు ప్రధాన దారులన్నీ జలమయమయ్యాయి. పరమేశ్వరీనగర్ శివారు, నెల్లూరు గ్రామీణ పరిధి వైఎస్ఆర్నగర్, చౌటమిట్టపాళెం, శ్రామికనగర్ తదితర చోట్ల లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది.
ప్రకాశం జిల్లాలో పొంగిన వాగులు
ప్రకాశం జిల్లా పామూరులో అత్యధికంగా 36.4 మి.మీ.వర్షం కురిసింది. మన్నేరు ఎగువ నుంచి లింగసముద్రం వద్ద ఉన్న రాళ్లపాడు జలాశయంలోకి 29,549 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ జలాశయం సామర్థ్యం 1.1 టీఎంసీలు. కొత్త స్పిల్వేలోని 5 గేట్లు ఎత్తి 37వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మన్నేరు పరివాహక ప్రాంతాలైన వి.ఆర్.కోట, అన్నెబోయినపల్లి, అంగిరేకులపాడు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పుటేరు ఉద్ధృతికి కందుకూరు నియోజకవర్గంలోని బసిరెడ్డిపాలెం-గుడ్లూరు మధ్య రాకపోకలు నిలిచాయి. దీంతో వివిధ గ్రామాల ప్రజలు సుమారు 16 కి.మీ. దూరం చుట్టూ తిరిగి గుడ్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. రాజుపాలెం సమీపంలో ఎలికేరు పొంగింది.
వాగులో పడి ఒకరి మృతి
చిత్తూరులో సోమవారం 20 నిమిషాలు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. తిరుపతిలో 15 నిమిషాలపాటు మోస్తరు వర్షం కురిసింది. తూర్పు ప్రాంతంలో పంటలు మునిగాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. గుడిపాల మండలం పాపిశెట్టిపల్లెకు చెందిన శ్రీరాములు యాదవ్(35) పొలానికి వెళ్లి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు చీలాపల్లి వాగులో కొట్టుకుపోయారు. చీలాపల్లి వాసులకు గ్రామ సమీపంలో సోమవారం మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మదనపల్లె గ్రామీణ మండలం వేంపల్లి పంచాయతీ మల్లయ్యకొండ తండా చెరువు కట్ట కుంగింది. ఆ ప్రభావం మరో చెరువుపై కూడా పడి చివరకు పట్టణంపై చూపుతుందని భావించిన యంత్రాంగం మొరవ నీళ్లను పక్కకు మళ్లించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు