వరద బాధితులను ఉదారంగా ఆదుకోండి
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో స్పందించాలని మ్ట్ల్య్రుమంత్రి జగన్ కోరారు. కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన వరద నష్టం అంచనాల్లో...
కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి జగన్
నష్టం లెక్కలు కచ్చితంగా వేశామని వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో స్పందించాలని మ్ట్ల్య్రుమంత్రి జగన్ కోరారు. కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన వరద నష్టం అంచనాల్లో... ఎక్కడా ఉ్శన్నదాన్ని పెంచి చూపించలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఎన్డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని కేంద్ర బృందం రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. ఈ బృంద సభ్యులు సోమవారం సీఎం జగన్ను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత మేర ఆదుకునేలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ విపత్తు నష్టం హృదయవిదారకం. నష్టం అంచనా వేసేందుకు మాకు ఆర్బీకేల రూపంలో సమర్థ వ్యవస్థ ఉంది. రైతు వేసే ప్రతి పంటా ఈ-క్రాప్లో నమోదైంది. సామాజిక తనిఖీ కూడా చేశాం. పంట నష్టంపై కచ్చితమైన, నిర్ధారిత లెక్కలున్నాయి. కొవిడ్ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందున ఎస్డీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయి. దీనికి అడ్హక్ నిధులు మంజూరు చేయమని కోరుతున్నాం. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తుల్ని నియంత్రించేందుకు చర్యలు చేపడతాం. వరద నీటిని తరలించేందుకు ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేందుకు ఒక కార్యక్రమం తీసుకొస్తున్నాం. రిజర్వాయర్లు, డ్యామ్లను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. ఆటోమేటిక్ వాటర్గేజ్ సిస్టం ఏర్పాటుపైనా దృష్టి పెడతాం’ అని సీఎం వివరించారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నందున ధాన్యం కొనుగోలులో తేమ, ఇతరత్రా నిబంధనల్ని సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
కడప జిల్లాలో భారీ నష్టం
కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడం వల్ల అపార నష్టం సంభవించిందని కేంద్ర బృందానికి సారథ్యం వహించిన కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. ‘చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. కడప జిల్లాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పశువులు చనిపోయాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలూ దెబ్బతిన్నాయి. ఊహించని రీతిలో కురిసిన భారీ వర్షాలకు తలెత్తిన వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు వంకలకు లేదు. ఆ స్థాయిలో వరదను నియంత్రించగలిగే ఆనకట్టలు, జలాశయాలు ఆ ప్రాంతంలో లేవు. ఉన్నవి ఈ స్థాయి వరదను ఊహించి నిర్మించినవి కాదు’ అని చెప్పారు. ‘మీ నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయం. అంకితభావం కలిగిన మీ అధికారులు విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. అత్యవసర సేవలను వెంటనే పునరుద్ధరించారు’ అని కేంద్ర బృందం ముఖ్యమంత్రితో పేర్కొన్నట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.6333.66 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్