ప్రభుత్వం మారినా.. విధానం మారకూడదు
ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు (పాలసీలు) మారకూడదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ప్రస్తుతం రోడ్డునపడ్డారని,..
రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు
మహాపాదయాత్రలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లాలో 35వ రోజు యాత్రకు విశేష స్పందన
నెల్లూరు జిల్లా గూడూరు మండలం నెర్నూరు వద్ద అమరావతి మహాపాదయాత్రలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఈనాడు డిజిటల్ - నెల్లూరు: బాలాయపల్లి, గూడూరు గ్రామీణం - న్యూస్టుడే: ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు (పాలసీలు) మారకూడదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ప్రస్తుతం రోడ్డునపడ్డారని, వారి కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, అక్కడ ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలని కోరారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 35వ రోజు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన లక్ష్మీనారాయణ మాట్లాడారు. ‘అమరావతి రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. రాజధానిని అభివృద్ధి చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటున్నారు తప్ప.. మాకు అన్యాయం జరిగిందని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర కూడా వారి స్వార్థం కోసం కాదు. రాష్ట్రం బాగు కోసమే. రాష్ట్రం బాగుపడాలంటే ఒక రాజధాని ఉండాలి. రాజధానిపై స్పష్టత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతూ, పెట్టుబడులు రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మళ్లీ తీసుకొస్తామంటున్న మూడు రాజధానుల బిల్లు ఎలా ఉంటుందో వేచి చూడాలి’ అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే అందరి ధ్యేయమన్నారు. ‘కావాలనుకుంటే ప్రభుత్వం శీతాకాల సమావేశాలు లాంటివి విశాఖ లేదా కర్నూలులో పెట్టుకోవాలి. కోనసీమను మత్స్య ఉత్పత్తుల రాజధాని (ఆక్వా క్యాపిటల్)గా, ప్రకాశాన్ని రవాణా రాజధాని (ట్రాన్స్పోర్టు క్యాపిటల్)గా, రాయలసీమను గనుల రాజధాని (మినరల్స్ క్యాపిటల్)గా ప్రకటించి అభివృద్ధి చేయాలి’ అని సూచించారు. పాదయాత్రలో రైతులు, పోలీసులు సంయమనంతో సాగాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం వివాదాలకు కారణమైన వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావును ఆదివారం పాదయాత్ర విధులకు అధికారులు దూరంగా ఉంచారు.
చెన్నై తెలుగువాసుల మద్దతు
అమరావతి నిర్మాణానికి అహర్నిశలు పోరాడుతూ మహా పాదయాత్ర చేస్తున్న ఐకాస ప్రతినిధులు, రైతులకు చెన్నై తెలుగువాసులు సంఘీభావం తెలిపారు. ఆదిశేషయ్య, నరేంద్ర, చంద్రశేఖర్లతో పాటు.. మరో 50 మంది పాల్గొని మద్దతు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది భూములిచ్చిన రైతుల చలవేనని చెప్పారు. సాటి తెలుగువారు పడుతున్న కష్టాన్ని చూసి తమ వంతు సాయం చేసేందుకు వచ్చామన్నారు. ఇప్పటికే చిన్నాభిన్నమైన రాష్ట్రం భవిష్యత్తు తరాల కోసం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తామంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినా సాటి తెలుగువారికి జరుగుతున్న అన్యాయానికి బాధ పడుతున్నామని చెప్పారు. తమ తాతతండ్రులు ఇక్కడే వ్యవసాయం చేసి తమను ఉన్నతస్థానంలో నిలిపారని, అలాంటి రైతులు కంటతడి పెడుతుంటే చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమవంతుగా యాత్రకు రూ.7 లక్షలు అందిస్తున్నామన్నారు. ఇది సాయం కాదని, తమ బాధ్యతన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది రైతుల చలవేనని చెప్పారు. వీరితోపాటు ఆస్ట్రేలియా ఎన్నారై ఫ్రెండ్స్ రూ.లక్ష, గుంటూరు జిల్లా గూడవల్లి గ్రామస్థులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph