Corona: ముంచుకొస్తోంది!
రాష్ట్రంలో కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది. రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిల్లో అత్యధికం ఒమిక్రాన్ వేరియంట్కు చెందినవేనని తెలుస్తోంది. ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి
5శాతాన్ని మించిన పాజిటివిటీ రేటు
పండగల వేళ మరింత ఉద్ధృతంగా కరోనా?
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది. రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిల్లో అత్యధికం ఒమిక్రాన్ వేరియంట్కు చెందినవేనని తెలుస్తోంది. ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన కొవిడ్ బాధితులతో పాటు ర్యాండమ్గా స్థానికుల నుంచి సేకరించి పంపిన సుమారు వంద నమూనాలను హైదరాబాద్లోని సీసీఎంబీలో పరీక్షించగా 80% వరకు ఒమిక్రాన్ వేరియంట్కు చెందినవిగా తేలింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఒమిక్రాన్ బారిన పడినవారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ చివరగా జనవరి 5న ప్రకటించింది. అప్పటికి 28 ఒమిక్రాన్ కేసులు రాగా, ఆ తర్వాత వివరాలను విడిగా ప్రకటించడం లేదు. కొత్తగా సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 36,452 నమూనాలు పరీక్షించగా 1,831 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467 మందికి వ్యాధి సోకగా, విశాఖలో 295, గుంటూరులో 164, కృష్ణాలో 190 చొప్పున కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,195 క్రియాశీలక కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గతేడాది డిసెంబర్ 27 నుంచి జనవరి 9వ తేదీ వరకు 864 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. జనవరి 3న 48, 4-45, 5-75, 6-73, 7-110, 8-115, 9-130, మంగళవారం 92 మంది చొప్పున ఇన్పేషెంట్లుగా చేరారు. విజయవాడ జీజీహెచ్లోని ‘కరోనా ఓపీ’లో సోమవారం అనుమానిత లక్షణాలు కలిగిన వారితో పాటు పాజిటివ్ బాధితులతో సన్నిహితంగా మెలిగినవారి నుంచి 150 నమూనాలు సేకరించారు. జనవరి ఒకటికి ముందు ఈ సంఖ్య 15-25 మధ్యే ఉండేది. రాష్ట్రంలో జనవరి ఒకటిన పాజిటివిటీ రేట్ 0.57% కాగా, మంగళవారం 5.01%గా నమోదైంది. పది రోజుల్లో ఇంతగా పెరగడాన్ని బట్టి సంక్రాంతి పండగ తర్వాత వ్యాధి ఉద్ధృతమవుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
రెండు, మూడో దశల్లో అంతరమిది!: కరోనా వేరియంట్లలో డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావం తక్కువగా ఉన్నా.. తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండో దశలో గతేడాది వేసవిలో విజృంభించిన డెల్టా వేరియంట్ వైరస్ బాధితుల ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయింది. శ్వాసకోశ సంబంధ సమస్యలు తీవ్రమై కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది. దగ్గు, జలుబు, విరేచనాలు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. చాలామందికి రెమ్డెసివిర్, టొసిలిజుమాబ్, ఇతర స్టిరాయిడ్లు వినియోగించారు. 14 రోజుల వరకు హోం ఐసొలేషన్లో ఉన్నారు. అదే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో గొంతు, ముక్కులో ఇన్ఫెక్షన్, తలనొప్పి, ఇతర సమస్యలు కనిపిస్తున్నాయి. వాసన కోల్పోవడం వంటి లక్షణాలు తక్కువగా ఉన్నాయి. కొందరికి వైరస్ సోకిన విషయమే తెలియడంలేదు. పారాసిటమాల్, సెట్రిజన్, ఇతర మాత్రలను వాడుతున్నారు. ఆయాసం, ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం వంటి సమస్యలు దాదాపుగా లేవని విజయవాడ జీజీహెచ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. డెల్టాతో పోల్చితే ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గిందన్నారు. విజయవాడ జీజీహెచ్లో ప్రస్తుతం 15 మంది ఇన్పేషెంట్లుగా చేరగా, ముగ్గురు ఆక్సిజన్పై ఉన్నారు. అమెరికా నుంచి కోస్తాకు వచ్చిన 55 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొంది, కోలుకున్నారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ ‘జలుబు, దగ్గుతో రెండు రోజులు ఇబ్బంది పడ్డాను. జ్వరం వచ్చినట్లు అనిపించినా, పరీక్షిస్తే లేదని తేలింది. షుగర్ దృష్ట్యా ఇన్సులిన్ తీసుకుంటూనే చికిత్స పొందాను.బాగా కోలుకున్నా’నని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం