కంప్యూటర్ల ద్వారానే అనుసంధానం
కొవిడ్ ఉద్ధృతి కారణంగా మళ్లీ వీడియో ద్వారా రోజువారీ కేసుల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... న్యాయవాదులకు కీలక సూచనలు చేసింది. కొందరు మొబైల్ ఫోన్ల ద్వారా విచారణలో
‘వీడియో విచారణ’ విషయంలో న్యాయవాదులకు సుప్రీంకోర్టు నిర్దేశం
ఫోన్లతో వస్తున్న ఇబ్బందుల పట్ల సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆవేదన
ఈనాడు, దిల్లీ: కొవిడ్ ఉద్ధృతి కారణంగా మళ్లీ వీడియో ద్వారా రోజువారీ కేసుల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... న్యాయవాదులకు కీలక సూచనలు చేసింది. కొందరు మొబైల్ ఫోన్ల ద్వారా విచారణలో పాల్గొంటుండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సాయంత్రానికల్లా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
* ఇకపై న్యాయవాదులు, కేసుల్ని సొంతంగా వాదించుకొనే వ్యక్తులు వీడియో ద్వారా విచారణకు హాజరైనప్పుడు డెస్క్టాప్/ల్యాప్టాప్ కంప్యూటర్, సుస్థిరమైన ఇంటర్నెట్తో అనుసంధానం కావాలి. విచారణ ప్రక్రియలో ఇబ్బందులు, న్యాయమూర్తులకు అసౌకర్యం కలిగించకుండా తీగ ఆధార నెట్వర్క్ను వాడటం మంచిది.
* మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో సమావేశంలో పాల్గొనడం మానుకోవాలి.
* న్యాయవాదులు ఒకేసారి రెండు మూడు పరికరాల ద్వారా కాకుండా... ఒక్క ల్యాప్టాప్/డెస్క్టాప్లోనే లాగిన్ అయ్యి, విచారణలో పాల్గొనాలి. వాదనలు వినిపించేవారు హెడ్సెట్తో కలిపి ఉన్న మైక్రోఫోన్ లేదా ఆడియో సిస్టంను ఉపయోగించడం మంచిది.
* విచారణ జరుగుతున్నప్పుడు ఆటంకాలు తలెత్తకుండా కంప్యూటర్లో ఉన్న మిగతా అప్లికేషన్లన్నింటినీ మూసివేయాలని రిజిస్ట్రీ పేర్కొంది.
10 కేసులు వాయిదా...
అంతకుముందు ఉదయం ఓ కేసు విచారణ సమయంలో మొబైల్ ఫోన్ల ద్వారా లాగిన్ అయిన న్యాయవాదులను చూడటం, వాదనలను వినడం ఇబ్బందికరంగా అనిపించడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు పది కేసులను వాయిదా వేయాల్సి రావడంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మొబైల్ ఫోన్ల ద్వారా హాజరయ్యే న్యాయవాదులు కనిపించడంలేదు. ఇకపై మొబైల్ ఫోన్లతో విచారణలో పాల్గొనడాన్ని నిషేధించాల్సి వస్తుంది. సుప్రీంకోర్టులో క్రమం తప్పకుండా వాదనలు వినిపించే మీరు వాదనల నిమిత్తం డెస్క్టాప్ కంప్యూటర్ను సమకూర్చుకోలేరా? ఉదయం నుంచి ఇలాంటి ఇబ్బందులే కొనసాగుతున్నాయి. కింది కోర్టుల్లో న్యాయవాదులు మొబైల్ ఫోన్లు వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు ఐప్యాడ్, ల్యాప్ట్యాప్, డెస్క్టాప్ వంటి పరికరాలు ఎందుకు సమకూర్చుకోకూడదు?’’ అని ప్రశ్నించారు. ధర్మాసనం సమయం ముగిసేముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వెళ్తూ... అందరూ డెస్క్టాప్, ల్యాప్ట్యాప్ లాంటివి తప్పితే మొబైల్ ఫోన్లు వాడొద్దని న్యాయవాదులకు చెప్పండని కోర్టు సిబ్బందికి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
ఇదీ సంగతి!
ఉన్న కొద్ది భూమిలో కొంత రీసర్వేలో పోగా.. మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పుణ్యమాని మింగేశారు. మరి నువ్వో!!
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్