మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు
‘ఐఆర్, హెచ్ఆర్ఏ తగ్గించి, జీతం పెరిగిందంటే ఎలా? అయిదు డీఏ బకాయిలు ఇవ్వడంతోనే ఈనెల నుంచి జీతం పెరుగుతుంది. ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువగా ఎన్నడూ ఇవ్వలేదు. రెండు నెలలుగా సీఎస్ చెబుతున్నదే మళ్లీమళ్లీ చెబుతున్నారు. మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు.
డీఏ బకాయిల వల్లే జీతం పెరుగుతోంది
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు
పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ మోకాళ్లపై ఉపాధ్యాయుల నిరసన
ఈనాడు, అమరావతి: ‘ఐఆర్, హెచ్ఆర్ఏ తగ్గించి, జీతం పెరిగిందంటే ఎలా? అయిదు డీఏ బకాయిలు ఇవ్వడంతోనే ఈనెల నుంచి జీతం పెరుగుతుంది. ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువగా ఎన్నడూ ఇవ్వలేదు. రెండు నెలలుగా సీఎస్ చెబుతున్నదే మళ్లీమళ్లీ చెబుతున్నారు. మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు. ఉద్యోగులకు లెక్కలు రావని అనుకుంటున్నారు’ అని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం అనంతరం... వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు... ‘పీఆర్సీ నివేదికలో ఒకట్రెండు అంశాలు పరిగణనలోకి తీసుకొని, అంతా అమలు చేశామని ఎలా చెబుతారు? కేంద్ర పీఆర్సీ అమలు చేస్తామంటున్నారు. కేంద్ర ఉద్యోగుల్లో జాయింట్ సెక్రటరీ కేడర్లో ఉండే సీనియర్ ఐఏఎస్కు ఉన్న జీతం, ఇక్కడ జాయింట్ సెక్రటరీకి ఇస్తారా? ఉద్యోగులకు నష్టం జరిగేవి మాత్రమే కేంద్ర పీఆర్సీ నుంచి తీసుకున్నారు. అసలు కేంద్ర పీఆర్సీ అమలుపై ఓ కమిటీ ఏర్పాటు చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చించి, అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. పీఆర్సీ అమలు జీవోలను ఉపసంహరించుకోవాలి. ఇక వీటిపై అధికారులతో చర్చలు జరిపేదిలేదు. వీరితో 10-12 సార్లు చర్చించినా ప్రయోజనం లేకపోయింది. అధికారుల కమిటీ అటు ఉద్యోగులను, ఇటు ప్రభుత్వాన్ని ముంచింది. ఇక అవసరమైతే సీఎంవో అధికారులతో మాత్రమే చర్చలు జరుపుతాం. సీఎం చొరవ చూపించాలి. అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాడేందుకు మాకు అభ్యంతరం లేదు’ అని తెలిపారు. ‘పీఆర్సీలో అనేక అంశాలు నష్టం చేసేవిగా ఉన్నాయి. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అశుతోష్మిశ్ర కమిటీ సిఫార్సులు ఉద్యోగులకు అందజేసి, వాటిపై చర్చించాలి. ఏదో నల్లబ్యాడ్జీలతో నిరసనతో ఏం చేస్తారని అనుకోవద్దు. రెండు, మూడు రోజుల్లో స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. ఉద్యోగుల ఆగ్రహం ప్రభుత్వానికి తెలియాలనే నిరసనలు ఆరంభించాం. సీఎం వద్ద సమావేశంతో ఫిట్మెంట్ వరకు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకొని అంగీకరించాం. హెచ్ఆర్ఏపై ఆరోజే సీఎం వద్ద చెప్పాం. ఇవేమీ పట్టించుకోకుండా అధికారుల కమిటీ సిఫార్సులు చేసింది. ఏకపక్షంగా ఇచ్చిన జీవోలపై పునరాలోచన చేయాలి’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులంతా బుధవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. గురువారం భోజన విరామ సమయంలో నిరసన తెలపనున్నారు.
మాకు న్యాయం చేయాలి: పొరుగుసేవల సిబ్బంది
ఏళ్ల తరబడి సచివాలయంలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని పొరుగు సేవల సిబ్బంది కోరారు. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ఉన్న పార్కు వద్ద ఈ ఉద్యోగులంతా కలిశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం జీతాలు పెంచాలని కోరారు. అనంతరం అక్కడికి వచ్చిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డితో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
ఇదీ సంగతి!
ఉన్న కొద్ది భూమిలో కొంత రీసర్వేలో పోగా.. మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పుణ్యమాని మింగేశారు. మరి నువ్వో!!
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్