బాబ్బాబూ.. టెండర్లు వేయండి!
పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతంటూ నిత్యం గగ్గోలు పెడుతున్న పుర, నగరపాలక సంస్థలు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం రెండు విడతలుగా కేటాయించిన
15వ ఆర్థిక సంఘం పనుల కోసం గుత్తేదారులకు అధికారుల వినతి
రెండేళ్లవుతున్నా అత్యధిక ప్రాంతాల్లో మొదలవని పనులు
పాత బిల్లుల పెండింగే కారణం
పుర, నగరపాలికల ఖాతాల్లో మూలుగుతున్న రూ.1,264 కోట్లు
ఈనాడు - అమరావతి
పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతంటూ నిత్యం గగ్గోలు పెడుతున్న పుర, నగరపాలక సంస్థలు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం రెండు విడతలుగా కేటాయించిన రూ.1,264 కోట్లు జమయి దాదాపు రెండేళ్లవుతున్నా ఇంకా ఖర్చు చేయలేదు. 2,3 సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు రావడం లేదని అధికారులు అంటున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తయిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. వీటిని చెల్లించాలని గుత్తేదారులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 15వ ఆర్థిక సంఘం పనులకు గుత్తేదారులు టెండర్లు వేయట్లేదు.
75% పనులకు టెండర్లు వేయలేదు
రాష్ట్రంలో పది లక్షలకు మించి జనాభా ఉన్న విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థలకు 2020-21 సంవత్సరానికి రెండు విడతలుగా రూ.270 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. మిగిలిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు మరో రూ.994 కోట్లను కేంద్రం అందించింది. వీటితో పట్టణాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు ప్రారంభించి ఈపాటికే పూర్తి చేయాలి. ప్రతిపాదిత పనుల్లో 75 శాతానికి గుత్తేదారులు టెండర్లు వేయలేదు. కొన్ని నగరపాలక సంస్థల్లో ఉన్నతాధికారులు గుత్తేదారులను బుజ్జిగించి టెండర్లు వేయించినా పనులు ప్రారంభం కాలేదు. విజయవాడ నగరంలో రూ.66 కోట్లతో 55 పనులు ప్రతిపాదించారు. వీటిలో గతేడాది వ్యవధిలో 12 పనులకు టెండర్లు ఖరారు చేశారు. మిగతా పనులకు మూడోసారి మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో రూ.7.50 కోట్ల పనుల్లో కొన్నింటికి మూడోసారి టెండర్లు పిలిచినా గుత్తేదారుల స్పందన లేదు.
ఆచరణకు నోచని మంత్రి ప్రకటనలు
సీఎఫ్ఎంఎస్తో సంబంధం లేకుండా పుర, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో చేయించిన పనులకు స్థానికంగా అధికారులు బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అనేకసార్లు ప్రకటించారు. నిధుల వ్యయం నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఇతర ప్రభుత్వ శాఖల జోక్యం లేకుండా చూస్తామన్న ఆయన హామీలు ఆచరణకు నోచుకోలేదు. 14వ ఆర్థిక సంఘం నిధుల పనులకు సంబంధించిన బిల్లులు సీఎఫ్ఎంఎస్లో ఏడాదిన్నరగా పెండింగులో ఉన్నాయి. ఆ బిల్లుల చెల్లింపు మాటేమిటని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఒకరు వాపోయారు.
చివర్లో తడిసిమోపెడు
ఐదేళ్లపాటు వరుసగా కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ కలిపి చివరి ఏడాదిలో వెచ్చించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏ ఏడాదిలో విడుదలైన నిధులు అదే ఏడాది ముగిసేలోగా వెచ్చిస్తే ఇబ్బంది ఉండదు. లేదంటే చివరి ఏడాదిలో పనులు తడిసి మోపెడై ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఇప్పటికీ దాదాపు రూ.వేయి కోట్లు ఖర్చు కాలేదు. 2022 మార్చిలోగా వీటిని వినియోగించుకోనట్లయితే కేంద్రం వెనక్కి తీసుకోనుంది. నిధులు సకాలంలో ఖర్చు చేయకపోవడం, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించనందున ఈ పరిస్థితి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు విషయంలోనూ నిర్దుష్ట కార్యాచరణతో ముందుకెళ్లాల్సి ఉందని పురపాలక కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్