AP News: డీజీపీ ఆఫీసుకు ఎందుకు?
గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కదా
తెదేపా నాయకులను అడ్డుకున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ
ఈనాడు, అమరావతి: గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారు రాబోతున్నారని తెలుసుకుని తెదేపా కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో ముందే మూసేశారు.
నాయకులను అడ్డుకుని అపాయింటుమెంట్ లేనిదే డీజీపీ కార్యాలయంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అపాయింటుమెంట్ అడిగామని, డీజీపీ నుంచి స్పందన లేదని, అందుకే నేరుగా బయల్దేరామని తెదేపా నేతలు చెప్పారు. డీజీపీ కాకపోతే.. అదనపు డీజీనైనా (శాంతిభద్రతలు) కలిసి వినతిపత్రమిచ్చేందుకు అనుమతించాలని కోరారు. దానికైనా అపాయింటుమెంట్ కావాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. తపాల్లో ఇచ్చి వెళతామన్నా అంగీకరించలేదు. ఇస్తే తమకివ్వాలని, లేదంటే తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పోనీ అదనపు ఎస్పీ తమను వెంటబెట్టుకుని వెళ్లాలని నేతలు కోరినా నిరాకరించారు. ప్రతిపక్షాలను ఇంత అవమానించకూడదని, రోడ్డుపై వినతిపత్రం తీసుకోవడమేంటని వర్ల ప్రశ్నించారు. మీకిస్తే డీజీపీకి విన్నపమిచ్చినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ పంపవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరిని పడితే వాళ్లను ఎలా పంపిస్తాం.. మీరు ప్రతిదాన్నీ ఇష్యూ చేయవద్దని డీఎస్పీ రాంబాబు వాగ్వాదానికి దిగారు. నిజనిర్ధారణ కమిటీలో ఉన్న ఆరుగురినైనా, కనీసం ముగ్గురినైనా పంపాలని విన్నవించినా ససేమిరా అన్నారు. దీంతో అక్కడే అదనపు ఎస్పీకి తెదేపా నేతలు విన్నపమిచ్చి అక్నాలెడ్జ్మెంటు తీసుకుని వెనుతిరిగారు.
‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అంటే తెదేపావారికి పోలీసులు సేవలందించరా? మా పార్టీవారిని ఎవరైనా హతమార్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అంటారా? వీళ్ల వైఖరి చూస్తుంటే రేపు పోలీసు స్టేషన్లోకి కూడా రానిచ్చేలా లేరు’ అని విలేకరులతో మాట్లాడుతూ వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సెక్యూరిటీ జోన్లోకి అడుగు పెట్టేందుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దుండగులు దాడిచేస్తే ఏం చేశారని ఆలపాటి ధ్వజమెత్తారు. ఎస్సీ, బీసీ నాయకులను, మాజీ మంత్రులను డీజీపీ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
‘మీరు రోజూ ప్రతి అంశానికి డీజీపీని ముడిపెట్టి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారు. మీ పార్టీ తరఫున డీజీపీకి లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేయండి. కానిస్టేబుల్నుంచి డీజీపీ వరకు పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టు మాట్లాడుతున్నారు కదా? మీకు డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి అపాయింటుమెంట్ లేదు. కావాలంటే ఆ వినతిపత్రం ఇక్కడే ఇచ్చి వెళ్లండి. మేం డీజీపీకి అందజేస్తాం’
-గుడివాడలో కేసినో వ్యవహారం, నిజనిర్ధారణకు వెళ్లిన పార్టీ నాయకులపై దాడికి సంబంధించి డీజీపీకి విన్నపమివ్వడానికి వెళ్లిన తెదేపా నాయకులతో గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం వ్యాఖ్యలివి.
‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి మిమ్మల్ని డీజీపీ ఆఫీసులో అడుగు పెట్టనివ్వబోమని కాగితంపై రాసివ్వండి. మరి కోడికత్తితో దాడి జరిగినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఇక్కడ కంప్లెయింటే ఇవ్వబోనన్న జగన్ మాటలు కూడా మీరు వినకూడదు కదా? ఆయన చెప్పినట్టు ఎలా పనిచేస్తున్నారు? అయినా పోలీసులపై నమ్మకం లేదని నేను ఎప్పుడూ అనలేదు. అడ్డగోలుగా మాట్లాడొద్దు.’
-తెదేపా నాయకుడు వర్ల రామయ్య స్పందన
‘పోలీసులపై నమ్మకం లేదని నేనన్నాను. గుడివాడలో తెదేపా నేతలపై జరిగిన దాడిపై డీఐజీని కలుస్తామంటే.. ఆయన ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో మారుమూలన ఉన్నానని, రావడానికి అర్ధరాత్రి అవుతుందని చెప్పారు. సాయంత్రం ఐదింటికి ప్రెస్మీట్ పెట్టి తెదేపావారు అరాచకం చేయడానికే వచ్చారని చెప్పారు. మాకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని న్యాయం చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే ఏమనాలి?’
- తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్