ఇప్పుడు ఎలా చేస్తారో?
రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో ఐఏఎస్ల నియామకాలు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, మౌలిక వసతులు, నిధుల కేటాయింపు కల్పన ఎలా ఉంటుందోనని అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలో కలెక్టర్, ఇతర
ఆర్డీఓ కార్యాలయాల్లో కలెక్టర్లు!
ఉన్న వారితోనే సర్దుబాటు.. కొత్త పోస్టులకు ఆర్థికశాఖ నో
ఈనాడు, అమరావతి: రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో ఐఏఎస్ల నియామకాలు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, మౌలిక వసతులు, నిధుల కేటాయింపు కల్పన ఎలా ఉంటుందోనని అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలో కలెక్టర్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కనీసం రూ.వంద కోట్ల చొప్పున అవసరమని అంచనా వేశారు. అంటే, మొత్తం రూ.1500 కోట్ల వరకు అవసరం అవుతుంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అదనంగా ఖర్చు లేకుండా చేయగలిగినంతే చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాల మేరకు అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వ శాఖలను కుదించడం ద్వారా భవనాల అవసరాలు తగ్గించేలా ప్రయత్నాలు జరగబోతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 125 వరకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖల్లో వేర్వేరు కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉంటాయి. కొత్త జిల్లాల రాకతో వీటిని ఒకే చోటకు తెచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. ఆర్డీఓ కార్యాలయాలను కొన్నిచోట్ల కలెక్టరేట్లుగా మార్చే విషయాన్ని పరిశీలించనున్నారు. అక్కడే ఆర్డీవో కూడా ఉండేలా సర్దుబాటు చేసే యోచనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన చేసినప్పుడే ప్రత్యేకంగా ఏర్పడ్డ కమిటీలు ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? వాటిల్లో ఏ ప్రభుత్వశాఖలు నడుస్తున్నాయి? జాతీయ రహదారికి ఎంత దూరంలో ఉన్నాయన్న వివరాలను సేకరించాయి. ఎస్పీ, ఇతర పోలీసు కార్యాలయాలపై పోలీసు శాఖ కసరత్తు చేసింది. తాత్కాలికంగా అద్దె భవనాల్లో కార్యాలయాలను నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జిల్లాకు ఇద్దరు ఐఏఎస్లు
ప్రస్తుతం జిల్లాల్లో జేసీ హోదాలో ఉన్న ఐఏఎస్లు రైతుభరోసా, గృహనిర్మాణ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, ఇతర శాఖల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇకపై పూర్వ విధానంలో మాదిరిగానే కలెక్టర్ కాకుండా జేసీగా మరో ఐఏఎస్ ఉండే అవకాశాలు ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలపలేమని ఆర్థికశాఖ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. దీనివల్ల కొత్త పోస్టులు అవసరమయ్యే చోట ఇప్పటికే ఉన్నవాటిని ఉన్నతీకరించి, సర్దుబాటు చేస్తారని తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం జిల్లాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గుతోంది. ఇలా ఒత్తిడి తక్కువగా ఉన్న ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించి, మార్గదర్శకాలు వెలువరిస్తారని తెలిసింది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఉద్యోగుల కేటాయింపులో అనుసరించిన విధివిధానాలు, అక్కడ ఇప్పటికీ ఉన్న సమస్యలనూ పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించనున్నారు.
ఇకపై వరుస సమావేశాలు
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వశాఖలు పూర్తిగా ఇటువైపేదృష్టి కేంద్రీకరించనున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నాయి. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేలోపే ముఖ్యమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!