Andhra News: వైకాపా పాలనలో ఊరికో కాలకేయుడు
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి జగన్రెడ్డి, వైకాపా నాయకులంతా సిగ్గుతో తలదించుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత,...
నిందితుల్లో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులే ఎక్కువ
మూడేళ్లలో వెయ్యికిపైగా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు
తెదేపా నేతలు వంగలపూడి అనిత, బొండా ఉమా ధ్వజం
‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ పేరుతో పుస్తకం విడుదల
ఈనాడు, అమరావతి: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి జగన్రెడ్డి, వైకాపా నాయకులంతా సిగ్గుతో తలదించుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో అధికార పార్టీ వాళ్లే ఎక్కువగా ఉన్నారని, చివరకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ పేరుతో తెదేపా రూపొందించిన 50 పేజీలకు పైగా పుస్తకాన్ని వారు మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. బొండా ఉమా మాట్లాడుతూ... ‘‘జగన్రెడ్డి పాలనలో ఊరికొక ఉన్మాది, కాలకేయుడు ఉన్నారు. రాష్ట్రంలో మహిళల్ని వేధింపులకు గురి చేసిన వారి జాబితాలో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నారని ఇటీవల విడుదలైన ఒక జాతీయ స్థాయి సర్వే నివేదిక బయట పెట్టింది...’’ అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఆడబిడ్డల మాన, ప్రాణాలకు ధర కడుతున్నారు. ఇంకెంతకాలం డబ్బులిచ్చి అత్యాచార బాధితుల నోళ్లు మూయించాలని చూస్తారు? బాధితురాలు బీసీ మహిళ అయితే రూ.10 లక్షలు, ఎస్సీ మహిళ అయితే రూ.5 లక్షలు ఇస్తూ... మాన ప్రాణాలకు కూడా విభజించి విలువ కడుతున్న పైశాచిక పాలన చూస్తున్నాం....’’ అని వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ‘‘ఎవడైనా ఒక ఆడబిడ్డను పొడిచి చంపేస్తే... నిందితుడిని అరెస్ట్ చేశారా? లేదా అని చూడటం లేదు. వెంటనే హోం మంత్రి, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వచ్చేసి బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు చెక్ ఇచ్చేస్తున్నారు. దళిత ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే రూ.5 లక్షలు తీసుకో... అని అంటున్నారు. అంటే వాళ్లు డబ్బులిస్తే వీళ్లు నోరు మూసేయాలా..’ అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో మహిళలపై ఇన్ని అత్యాచారాలు, హత్యాకాండలు జరిగితే... ఒక్క కేసులోనైనా దోషులకు శిక్ష విధించామని చెప్పే ధైర్యం సీఎంకి, హోం మంత్రికి ఉన్నాయా అని పేర్కొన్నారు.
కాలకేయులు వీళ్లే...!
‘‘మూడేళ్ల వైకాపా పాలనలో వెయ్యి మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగాయంటేనే మహిళల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యమెంతో అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో మూడో వంతు ఏపీలోనే వెలుగు చూస్తున్నాయి...’’ అని ఆ పుస్తకంలో తెదేపా ధ్వజమెత్తింది. జాతీయ స్థాయిలో వివిధ నేరాలకు సంబంధించి రాష్ట్రం ఏ స్థానంలో ఉందో... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో వెల్లడించిన వివరాలను ప్రచురించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, అసభ్య ప్రవర్తన, వేధింపులకు సంబంధించిన 717 సంఘటనలు, బాధితుల జాబితాను పొందుపరిచారు.
* మహిళల్ని వేధించిన కేసుల్లో పలువురు వైకాపా నేతలంటూ... వివిధ సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాలు కూడా పుస్తకంలో ఇచ్చారు.
మహిళా ఉద్యోగినులకు వైకాపా నేతల వేధింపులు
2022 మార్చి 19: కడప ఐసీడీఎస్ డైరెక్టర్ పద్మజపై అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాటలతో దాడి చేశారు. అప్పటి కడప ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ విజయరామరాజు సమక్షంలోనే ఆ మహిళా అధికారిణిని కంటతడిపెట్టేలా చేశారు.
2021 డిసెంబరు 6: మేం చెప్పిన మాట వినకపోతే చీరేస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎంపీడీఓ కె.ఆర్.విజయపై వైకాపా నేత వాసంశెట్టి తాతాజీ దాడి.
2020 జూన్ 8: అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ డాక్టర్ అనితారాణికి స్థానిక వైకాపా నేతల వేధింపులు.
2019 అక్టోబరు 5: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దాడి. చెప్పిన సమయానికి ఆయన బంధువు కృష్ణారెడ్డి లేఅవుట్కు అనుమతులు ఇవ్వలేదని బూతుల దండకం. ఇంటి విద్యుత్ వైర్లు కట్ చేశారు. వాటర్ పైప్లైన్లు ధ్వంసం చేశారు. స్వయంగా స్టేషన్కి వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించలేదు.
తీవ్రమైన నేరాలు ఇవీ..!
మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కొన్ని తీవ్రమైన నేరాల వివరాలను పుస్తకంలో వివరంగా పొందుపరిచారు. వాటిలో కొన్ని ఇవీ..!
* 2022 ఏప్రిల్ 20: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం ఘటన. రాష్ట్రంలో శాంతిభద్రతల ఘోర వైఫల్యానికి నిదర్శనం. నిందితుల్ని పట్టుకున్నామని హడావుడి చేసిన హోం మంత్రి వనిత దిశ చట్టం కింద శిక్ష విధించే అంశంపై నోరు మెదపలేదు.
* 2022 డిసెంబరు 9: పులివెందులలో ఎస్సీ మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. నిందితుల్ని శిక్షించకపోగా బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా నేతలు బీటెక్ రవి, వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసు నమోదు చేశారు. బీటెక్ రవిని 14 రోజులు జైల్లో పెట్టారు.
* 2021 జూన్ 21: తాడేపల్లిలోని సీఎం ఇంటికి కూత వేటు దూరంలో కృష్ణానది ఒడ్డున సీతానగరం ఘాట్లోకి కాబోయే భర్తతో సరదాగా మాట్లాడేందుకు వెళ్లిన ఎస్సీ యువతిపై అత్యాచారం. వారిలో ప్రధాన నిందితుడైన వెంకటరెడ్డిని ఇంతవరకు పట్టుకోలేదు.
* 2021 ఫిబ్రవరి 24: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష అనే యువతిని వైకాపా కార్యకర్త విష్ణువర్థన్రెడ్డి గొంతు నులిమి చంపేశాడు. తనను ప్రేమించనందుకు ఆ యువతిని బలి తీసుకున్నాడు.
* 2021 ఆగస్టు 3: గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురంలో ఇంటి అవసరాల కోసం తన దగ్గర అప్పు తీసుకున్న రమావత్ మంత్రుబాయి అనే మహిళను వైకాపా నేత శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు.
* 2020 డిసెంబరు 23: అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే ఎస్సీ యువతిని రాజేశ్ అనే కిరాతకుడు అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. తన కుమార్తెను రాజేశ్ వేధిస్తున్నాడని అంతకుముందే పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.
* 2021 అక్టోబరు 1: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్న దంపతులపై దుండగులు దాడి చేశారు. భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్వయంగా బాధితురాలు పోలీసుస్టేషన్కు వెళ్లి కన్నీరు పెట్టుకున్నా పోలీసులు స్పందించలేదు.
* 2020 డిసెంబరు 19: ఒంగోలులో వార్డు వాలంటీరుగా పనిచేస్తున్న ఉమ్మినేని భువనేశ్వరి అనే దివ్యాంగురాలిని తన త్రిచక్ర వాహనంలోనే దుండగులు సజీవ దహనం చేశారు.
* 2020 జులై 18: రాజమండ్రిలో 16 ఏళ్ల ఎస్సీ బాలికపై నాలుగు రోజుల పాటు ఏడుగురు యువకుల అత్యాచారం.
* కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మనేరంపల్లిలో ఒక బీసీ యువతిపై అమ్మిరెడ్డి నాగేంద్రబాబురెడ్డి అనే వ్యక్తి అత్యాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.