తిరుమలలో భక్తుల రద్దీ సర్వదర్శనానికి 20 గంటలు

శ్రీవారి దర్శనానికి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి

Updated : 26 Jun 2022 06:45 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి వరాహస్వామి అతిథిగృహం సమీపం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉన్నారు. వీరు శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు 20 గంటలకుపైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. గదుల కోసం భక్తులు నిరీక్షించాల్సి వస్తుంది. శుక్రవారం 71,589 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.4.30 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఈ నెల 27న సాయంత్రం నాలుగు గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్‌ చేసుకునేందుకు సోమవారం ఉదయం 10 నుంచి జూన్‌ 29 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో టికెట్ల కేటాయింపు జరుగుతుంది. టికెట్లు పొందినవారి జాబితాను ఈనెల 29 మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కేటాయింపు వివరాలు ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు టికెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది.
బీ దివ్యాంగులు, వయోవృద్ధులకు శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఈనెల 28న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని