పాత జిల్లాల కలెక్టర్లతోనే ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను పాత జిల్లాల్లోని కలెక్టర్లే ఖరారు చేయనున్నారు. కొత్త జిల్లాల కలెక్టర్లు వారితో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని

Published : 30 Jun 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను పాత జిల్లాల్లోని కలెక్టర్లే ఖరారు చేయనున్నారు. కొత్త జిల్లాల కలెక్టర్లు వారితో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం స్పష్టం చేసింది.  ప్రొబేషన్‌ సమయానికి కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు ఖరారు చేయాలన్న దానిపై సందేహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పై మేరకు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టత నిచ్చింది.

* వార్డు సచివాలయాల్లో పరిపాలన, పారిశుద్ధ్యం, తదితర విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషన్‌ను పురపాలక ప్రాంతీయ సంచాలకులు (ఆర్డీఎంఏ) ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని