ప్రత్యేక హోదా ఇవ్వండి

విభజన కారణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం జగన్‌ కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని

Published : 05 Jul 2022 03:38 IST

పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి

ప్రధాని మోదీకి వినతిపత్రం ఇచ్చిన సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: విభజన కారణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం జగన్‌ కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని విన్నవించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మోదీకి ఆయన పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందించినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘రీసోర్స్‌ గ్యాప్‌ గ్రాంటుగా రూ.34,125.50 కోట్లు ఇవ్వాలి. తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచి రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇచ్చే రేషన్‌ను సవరించాలి. కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలకు ఆర్థిక సహాయం చేయాలి. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన అనుమతుల్ని త్వరగా మంజూరు చేయాలి. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలి’ అని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని