కూల్చేందుకు మీకెంత ధైర్యం?
‘మీకు ఎంత ధైర్యం ఉంటే నేను కట్టించిన నిర్మాణాన్నే కూల్చేందుకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా వస్తారు..? అక్రమ నిర్మాణాలు పట్టణంలో చాలా ఉన్నాయి. అవి కూల్చాకనే ఇటు వైపు రండి.. లేదంటే బాగోదు. నోటీసు ఇస్తే... దానిపై నేను ఇచ్చే సమాధానంపై
రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులపై వైకాపా నేత శివారెడ్డి వీరంగం
కదిరి పట్టణం, న్యూస్టుడే: ‘మీకు ఎంత ధైర్యం ఉంటే నేను కట్టించిన నిర్మాణాన్నే కూల్చేందుకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా వస్తారు..? అక్రమ నిర్మాణాలు పట్టణంలో చాలా ఉన్నాయి. అవి కూల్చాకనే ఇటు వైపు రండి.. లేదంటే బాగోదు. నోటీసు ఇస్తే... దానిపై నేను ఇచ్చే సమాధానంపై సంతృప్తి చెందని పక్షంలో మీ పని కానీయండి...’ అని రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులపై స్థానిక వైకాపా నేత శివారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కదిరి పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన అడపాల వీధిలో సర్వే నెం.206లో 86 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. 2006లో ఇందులో సంపన్నులైన పలువురు ఇంటి పట్టాలు పొందారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడం, రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఆ పట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. లబ్ధిదారుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఇక్కడ పట్టా పొందిన వైకాపా నేత శివారెడ్డి గత నెలలో భవన నిర్మాణ పనులు చేపట్టారు. భాజపా నాయకులు ఆందోళనకు దిగడంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో శనివారం కదిరి తహసీల్దారు గోపాలకృష్ణ బదిలీ అయ్యారు. ఈ బదిలీ విషయం తెలుసుకొని తాజాగా ఆదివారం రాత్రి శివారెడ్డి మళ్లీ పనులు ప్రారంభించి గోడలు కట్టేశారు. ఈ సమాచారం అందుకున్న తహసీల్దారు గోపాలకృష్ణ (రిలీవ్ కాలేదు), ఉప తహసీల్దారు ముకుంద, రెవెన్యూ, సచివాలయ సిబ్బందితో పాటు అర్బన్ సీఐ మధు, సిబ్బంది అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు అక్కడకు చేరుకున్నారు. తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, మిగతా ప్రాంతాల్లోని నిర్మాణాలు కూల్చేశాక రావాలని శివారెడ్డి అడ్డుకున్నారు. బలవంతంగా తొలగిస్తే రెవెన్యూ అధికారుల అవినీతిని ఆధారాలతో బయటపెట్టి ఆత్మహత్యకు ప్రయత్నిస్తానంటూ బెదిరించారు. పార్టీలోని ఇతర నాయకులకు ఆయన ఫోన్ చేశారు. దాంతో మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాజశేఖర్రెడ్డి, కుమ్మరవాండ్లపల్లి సర్పంచి కుమారుడు మణికంఠ నాయక్తో పాటు మరికొందరు నేతలు అక్కడికి చేరుకున్నారు. శివారెడ్డికి మద్దతుగా వారు అధికారులతో పరుష పదాలతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చేందుకు మీకు ఎంత ధైర్యం అని ప్రశ్నిస్తూ... ఆవేశంతో ఊగిపోయారు. ఆధారాలతో కార్యాలయానికి రావాలంటూ వారికి చెప్పి తహసీల్దారు ఇతర సిబ్బంది, పోలీసులతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై తహసీల్దారు గోపాలకృష్ణ మాట్లాడుతూ... ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.