పట్టుపట్టి సాధించారు
కుటుంబ ప్రోత్సాహమే తనను టాపర్గా నిలిపిందని రాణి సుస్మిత చెప్పారు. కుటుంబంలో ఎక్కువ మంది విద్యావంతులు కావడం, భర్త సహా అందరి ప్రోత్సాహం లభించడం తన
గ్రూపు-1 ర్యాంకర్ల మనోగతం కుటుంబ ప్రోత్సాహమే గెలిపించింది
గ్రూపు-1 టాపర్ రాణి సుస్మిత
పిఠాపురం, న్యూస్టుడే: కుటుంబ ప్రోత్సాహమే తనను టాపర్గా నిలిపిందని రాణి సుస్మిత చెప్పారు. కుటుంబంలో ఎక్కువ మంది విద్యావంతులు కావడం, భర్త సహా అందరి ప్రోత్సాహం లభించడం తన విజయానికి కారణమని పేర్కొన్నారు. తొలి 5 ర్యాంకుల్లో నిలుస్తానని భావించానని, మొదటి ర్యాంకు రావడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికైన కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. పదో తరగతి వరకూ పిఠాపురంలో చదువుకున్నట్లు వివరించారు. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా... గతంలో ర్యాంకులు సాధించిన టాపర్ల సూచనలతో గ్రూప్స్కు సాధన చేసినట్లు చెప్పారు. ‘సివిల్స్ సన్నద్ధత గ్రూపు-1లో విజయం సాధించేందుకు ఉపయోగపడింది. గ్రూపు-1 మౌఖిక పరీక్ష దరఖాస్తులో నమోదుచేసిన వివరాల ఆధారంగా బోర్డు సభ్యులు ప్రశ్నలు వేశారు. సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీల మధ్య ఉన్న వ్యత్యాసం, సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాధాన్యం, పీహెచ్డీ చేసి, ఇటువైపు ఎందుకొచ్చారు? అన్న ప్రశ్నలు నాకు ఎదురయ్యాయి. ‘డూయింగ్ గ్రేటర్ గుడ్’ అనే సిద్ధాంతం నమ్మి... అధ్యాపకురాలిగా కంటే.. గ్రూపు-1 ఆఫీసర్ అయితే ఎక్కువ మందికి సేవలు అందించొచ్చని ఇటువైపు వచ్చినట్లు చెప్పాను’ అని సుస్మిత వివరించారు.
డిప్యూటీ కలెక్టర్గా రైతు బిడ్డ
గ్రూపు-1 రెండోర్యాంకరు శ్రీనివాసులురాజు
లక్కిరెడ్డిపల్లె, న్యూస్టుడే: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి మండలం పందిళ్లపల్లె పంచాయతీ కోతులగుట్టపల్లెలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కొండూరు శ్రీనివాసులు రాజు గ్రూప్-1 ఫలితాల్లో రెండోర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. 1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలో... 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రాయచోటిలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో చదివారు. కడపలో డిగ్రీ, తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదివారు. తర్వాత దిల్లీలో కోచింగ్ తీసుకుని మూడు మార్లు సివిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని శ్రీనివాసులురాజు తెలిపారు.
రచనా నైపుణ్యం ఉండాలి
సంజనా సింహా, హైదరాబాద్, గ్రూపు-1 మూడో ర్యాంకు
సివిల్స్ కంటే గ్రూపు-1 సిలబస్సే ఎక్కువ. ముఖ్యంగా ఏపీ ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ చాప్టర్లను అదనంగా చదవాల్సి వచ్చింది. గ్రూపు-1 కానీ... సివిల్్్సలో కానీ మెయిన్స్కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు చూసి, జవాబులు ఎలా రాయాలో ముందుగానే సన్నద్ధం అయ్యాను. రైటింగ్ స్కిల్ బాగుంటేనే మార్కులు ఎక్కువగా వస్తాయి. గ్రూపు-1 ఇంటర్వ్యూలో ఇన్కంటాక్స్, సోషియాలజీకి సంబంధించిన ప్రశ్నలూ వచ్చాయి. నేను రామకృష్ణమఠంలో వాలంటీరుగా పనిచేసినందున స్వామి వివేకానంద గురించి ఏమి తెలుసు, బ్యూరోక్రసీలోకి వస్తే మీరు ప్రజలకు ఎలా సేవ చేస్తారన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. మాది హైదరాబాద్. నా విజయంలో భర్త సహకారమెంతో ఉంది. ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్-2021లో 37వ ర్యాంకు వచ్చింది. ఐ.ఎ.ఎస్. వచ్చే అవకాశం ఉంది. 2020 సివిల్స్లో 207వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కంటాక్స్ ట్రైనింగ్ కోసం నాగ్పుర్లో ఉన్నా. గ్రూపు-1 తొలిసారి రాశా. డిజిటల్ మూల్యాంకనం ద్వారా వెల్లడైన జాబితాలో నా పేరు లేదు. సంప్రదాయ విధానంలో జరిగిన మూల్యాంకనం ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.