ఏడున్నర దశాబ్దాల్లో ఎగుడుదిగుళ్లు
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందించి.. పదిలపరచుకోవటానికి, భాష, వాక్, విశ్వాస, మత, ఆరాధనా స్వాతంత్య్రాలకు, అందరికీ సమానావకాశాలు అందించడానికి మనం రాజ్యాంగం రాసుకున్నాం. దేశాన్ని ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామికమ’ని ప్రకటించుకున్నాం.
సవాళ్ల నడుమ మన ప్రజాస్వామ్యం
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందించి.. పదిలపరచుకోవటానికి, భాష, వాక్, విశ్వాస, మత, ఆరాధనా స్వాతంత్య్రాలకు, అందరికీ సమానావకాశాలు అందించడానికి మనం రాజ్యాంగం రాసుకున్నాం. దేశాన్ని ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామికమ’ని ప్రకటించుకున్నాం. అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని నిర్దేశించుకున్నాం. 75 ఏళ్లుగా స్వాతంత్య్ర ఫలాలను ఆరగిస్తున్నాం. ఇందులో ఎన్ని పళ్లు తియ్యగా ఉన్నాయో ఎన్ని చేదుగా ఉన్నాయో, ఎన్ని అసలు ఫలించలేదో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజాస్వామ్యమంటేనే ప్రజల పాలన. వారి పక్షాన ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములవ్వాలి. వీరిలో అత్యధికులు 30-40% ప్రజల ఆమోదం మాత్రమే పొందినవారు. వీళ్లు ప్రజలకు ప్రతినిధులుగా కాక, తమ రాజకీయపార్టీల ప్రతినిధులుగా.. వాటి అధినేతల ఆదేశాలకు లోబడి ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత? వారి స్వామ్యం ఎంత? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఎన్నికలు జరిగే విధానం, పాలనలో నాణ్యత, భిన్నాభిప్రాయాలకు విలువ, విద్యలో స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి ముఖ్య సూత్రాలు. భారతదేశంలో ఇవన్నీ ఒక్కక్కటిగా బలహీనపడుతుండడం ఆందోళనకరం. ఈ సహస్రాబ్ది మొదలైన 22 ఏళ్లలో అవి మరింతగా దిగజారాయి. వ్యక్తులు, సంస్థలు, పార్టీలు, మేధావులు, పాత్రికేయులపై అణచివేత చర్యలు ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.
ఆర్థిక.. స్వేచ్ఛాస్వామ్యాలు అవసరం
ప్రజలు నాణ్యంగా జీవించాలంటే వారి ఆర్థికావసరాలు నెరవేరాలి. గ్రామీణ వృత్తులను ప్రోత్సహిస్తే నేతన్నలు, హస్తకళల నిపుణులు చక్కగా జీవించే పరిస్థితి ఉండేది. వలస కూలీలుగా మారే దుస్థితి తప్పేది. సాగు రంగానికి ప్రభుత్వపరంగా సంపూర్ణ తోడ్పాటు లేని కారణంగా గ్రామీణ వ్యవస్థలు చెల్లాచెదురయ్యాయి. 2011లో ప్రపంచ బ్యాంకు భారతదేశంలో పేదరికం 42% ఉందని ప్రకటించింది. 182 ప్రపంచ దేశాల్లో అభివృద్ధి విషయంలో మనëది 134వ ర్యాంకు. సంక్షేమ పథకాల ముసుగులో అభివృద్ధి మందగించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలను విస్మరించడం సరికాదు.
ఏకస్వామ్య పోకడలతో చేటు
అవినీతి, కులమత వర్గ తత్వాలు, ముఠా కుమ్ములాటలు, ప్రభుత్వ వ్యవస్థల్లో పక్షపాత ధోరణి వంటి అవాంతరాల మధ్య.. ముళ్ల కంచె మీద వస్త్రంలా మన ప్రజాస్వామ్యం నిలిచి ఉంది. దీన్ని లోపరహితం చేయాలంటే న్యాయ, రాజకీయ, సామాజికంగా మార్పులు అవసరం. ప్రశ్నించే వారిని వేధిస్తూ, అసంతృప్తిని అణచిపెట్టడం ప్రజాస్వామ్యం కాదు. 21వ శతాబ్దంలో అధికారానికొచ్చిన పార్టీల్లో ఈ ధోరణులు మితిమీరుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నూరు శాతం ఏకాభిప్రాయం అసాధ్యం. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి అమలు చేయడమే సరైంది.
సామాన్యులకు దూరంగా అధికారం
ఎక్కువ మంది ఓటు వేసినంత మాత్రాన అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనిపించుకోదు. ప్రతిపక్షం లేని భారతదేశాన్ని నిర్మిస్తామని అనటం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ‘అందరూ ఒకే పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని శాసించేది ప్రజాస్వామ్యం కాదు’ అంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎన్నికల్లో ధనవ్యయం పెరగటం ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలు. రెండు దశాబ్దాలుగా డబ్బున్న వారినే ఎన్నికల్లో నిలబెట్టే పరిస్థితి వచ్చింది. నోట్లతో ఓట్లు కొనే ధోరణి ఫలితంగా మధ్యతరగతి వారు చట్టసభల్లోకి వెళ్లలరు. పార్లమెంటులో 1/5 వంతు మంది తీవ్రమైన నేరచరిత్ర కలవారన్నది చేదు నిజం.
ప్రజల ఐక్యతే మన బలం
న్యాయవ్యవస్థ స్వతంత్రత, పదునైన అవినీతి నిరోధక చట్టాలు, నిజాయతీపరులైన అధికారులు.. ఇవన్నీ పటిష్ఠ రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే సాధ్యం. పార్లమెంటులో మెజారిటీని అడ్దం పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను అడ్డుకోగల సమర్థత, అధికారం, అవకాశం ఒక్క న్యాయవ్యవసకే ఉన్నాయి. భిన్నభాషలు, జాతులు, సంస్కృతుల సమ్మేళనంగా రూపొందిన భరతజాతిలో వైరుధ్యాలు, భేదాభిప్రాయాలు సహజం. అయినా జాతీయ సమైక్యతకు యావద్భారతమూ ఒక్కటిగా నిలబడి సహకరించుకోవటం మన బలం. ప్రజలు వ్యక్తిగతంగా బలహీనులే కావచ్చు. తమ ఆత్మగౌరవానికి, రక్షణకు, ఐక్యతకు, స్వేచ్ఛకు తామే రక్షకులమని గ్రహించాలి.
మహిళలకు మంచిరోజులొచ్చేనా?
మహిళలకు రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఇచ్చిన 161 దేశాల్లో మనం 141వ స్థానంలో ఉన్నాం. మనకంటే మెరుగైన రీతిలో నేపాల్ 48, బంగ్లాదేశ్ 91వ స్థానాల్లో ఉన్నాయి. రువాండాలో మహిళా పార్లమెంటేరియన్లు 56.3%, క్యూబాలో 48.9% ఉన్నారు. 12% కన్నా మించని మహిళా ప్రతినిధులున్న మనం పునర్మూల్యాంకనం చేసుకోవాలి. నేటికీ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోవడం శోచనీయం. ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి లాంటి కొద్దిమంది మహిళలకు అందివచ్చిన సానుకూలతలు అందరికీ దక్కే వాతావరణాన్ని కల్పించటం అవసరం.
స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా.. ఈ లోపాలను సమీక్షించుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి.
- మండలి బుద్ధప్రసాద్, పూర్వ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
మానవనిర్మిత శాసనాలనైనా, దైవశాసనాలనైనా మనఃపూర్వకంగా శిరసావహించే.. చట్టానికి కట్టుబడి ఉండే పౌరులెవరికైనా ప్రజాస్వామ్యం అనేది సహజంగా నచ్చుతుంది. వ్యక్తి స్వేచ్ఛకు నేను విలువ ఇస్తాను. మానవుడు సంఘజీవి అనే విషయం మరిచిపోకూడదు. తమ వ్యక్తిగత అభిమతాల్ని సామాజికాభివృద్ధి అవసరాలతో సరిపెట్టుకోగలగటం వల్లే మానవుడు ఇప్పటి ఈ దశకు ఎదిగాడు. సంఘశ్రేయస్సు కోసం సామాజిక నిబంధనలను ఐచ్ఛికంగా శిరసావహించటం వ్యక్తికీ, సమాజానికి ఉభయతారకం’’
- మహాత్మాగాంధీ
మీ బానిసత్వాన్ని, మీ పేదరికాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడి మీదో.. మహానుభావుల మీదో ఆధారపడవద్దు
- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్