రాజ్యాంగంపై అవగాహన పెరగాలి
ఆధునిక భారత న్యాయవ్యవస్థ తన తీర్పుల ద్వారా ప్రజా విశ్వాసాన్ని గెలుచుకుందని, అది కలకాలం నిలవాలంటే న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
అప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకుంటారు
అప్రమత్తత ఉన్న సమాజంతో హక్కులు సురక్షితం
స్థానిక భాషల్లో న్యాయశాస్త్ర పుస్తకాలు రావాలి
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
ఈనాడు, దిల్లీ: ఆధునిక భారత న్యాయవ్యవస్థ తన తీర్పుల ద్వారా ప్రజా విశ్వాసాన్ని గెలుచుకుందని, అది కలకాలం నిలవాలంటే న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ వ్యవస్థల పనితీరు గురించి ప్రజల్లో అవగాహన పెరిగితేనే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందన్నారు. ప్రజలు జాగరూకులైతే ప్రజాస్వామ్యాన్ని వారే కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు. సమాజం అప్రమత్తంగా ఉంటేనే హక్కులు సురక్షితంగా ఉంటాయని, రాజ్యాంగ సంస్కృతి వేళ్లూనుకుంటే ఆ జాగరూకత, అప్రమత్తత శాశ్వతంగా నిలుస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో సోమవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘భారత న్యాయస్థానాలు... నాటి నుంచి నేటి వరకు’ అనే తెలుగు పుస్తకాన్ని.. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి సంబంధించిన నాణ్యమైన పుస్తకాలు ఆంగ్లభాషకే పరిమితమయ్యాయన్నారు. ఇవి అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి వస్తే తప్ప న్యాయవ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన పరిజ్ఞానం అందరికీ లభించదన్నారు.
వ్యవస్థల స్వతంత్రతను కాపాడుతున్న సుప్రీంకోర్టు
‘‘న్యాయం అందించడం కేవలం కోర్టుల బాధ్యత అనుకోవడం తప్పని ఆర్టికల్ 38 స్పష్టంచేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే బాధ్యతను అది ప్రభుత్వాలకు అప్పగించింది. రాజ్యాంగంపై నమ్మకం కలిగించే సమాన బాధ్యత కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలపై ఉంది. రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చేందుకు భారతీయ న్యాయవ్యవస్థ శ్రమిస్తోంది. చట్టాలకు సరైన నిర్వచనం చెప్పడం ద్వారా చట్టసభల అసలైన ఉద్దేశాలను న్యాయవ్యవస్థలు ఆచరణలో పెడుతున్నాయి. ఎక్కడైనా తప్పు జరిగితే న్యాయవ్యవస్థ అండగా నిలుస్తుందన్న నమ్మకం ప్రజలకు ఉంది. భారత న్యాయస్థానాల ప్రస్థానంపై పుస్తకాన్ని తెలుగు సహా ఇప్పటివరకు 7 భాషల్లో విడుదల చేసినట్లయింది. త్వరలో అన్ని భారతీయ భాషల్లో విడుదలవుతుందని ఆశిస్తున్నా.
కొవిడ్పై నిర్లక్ష్యం తగదు
కొవిడ్పై నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. నేను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ మహమ్మారి మనల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రమాణ స్వీకారోత్సవానికి కనీసం కుటుంబ సభ్యులూ హాజరుకాలేని పరిస్థితి. లాక్డౌన్ల కారణంగా ఒక ఏడాది కేసులు పెండింగ్లో పడిపోయాయి. సమీప భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాను’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ మాట్లాడుతూ- దేశంలో 43% మంది శాసనకర్తలకు నేరచరిత్ర ఉందనీ, ఇలాంటివారు ఎన్నిక కాకుండా ఒక చట్టాన్ని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సీనియారిటీ కంటే కేవలం కేసుల పరిష్కారం ప్రాతిపదికగా దిగువ న్యాయస్థానాల నుంచి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫార్సు చేయాలని కోరారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.
విజయానికి అడ్డదారుల్లేవు
-జస్టిస్ ఎన్.వి.రమణ
విజయానికి అడ్డదారులు లేవన్నది యువతరం గ్రహించాలి. ఎవ్వరూ ఆశలు వదులుకోకూడదు. ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామ్య పాత్ర పోషించాలి. రాజ్యాంగ సూత్రాలను నిజమైన స్ఫూర్తితో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. మువ్వన్నెల పతాకాన్ని చూసి తెలుగునేలపై పుట్టిన పింగళి వెంకయ్యను గుర్తు చేసుకోకుండా ఉండలేం. ఆయన రూపొందించిన జాతీయ జెండా స్వతంత్ర భారతదేశానికి గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..