అరెస్టుల్లో అరాచకం!
రాష్ట్రంలో పోలీసు, సీఐడీ ఏకపక్ష, పక్షపాత ధోరణిని ఎండగడుతూ సాక్షాత్తూ హైకోర్టు పలు సందర్భాల్లో హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. సీఐడీ విభాగమైతే అధికారపక్షమైన వైకాపా ప్రయోజనాలను పరిరక్షించటం, ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడటమే తమ ప్రధాన విధి, బాధ్యతన్నట్లుగా
అధికార పార్టీ సేవలో సీఐడీ
ప్రతిపక్షాలకు వేధింపులు
ముఖ్యమంత్రిని పల్లెత్తు మాటన్నా వెంటనే చర్యలు
అర్ధరాత్రి గోడలు దూకి వచ్చి మరీ నిర్బంధం
న్యాయస్థానాలు ఆక్షేపిస్తున్నా మారని తీరు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో పోలీసు, సీఐడీ ఏకపక్ష, పక్షపాత ధోరణిని ఎండగడుతూ సాక్షాత్తూ హైకోర్టు పలు సందర్భాల్లో హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. సీఐడీ విభాగమైతే అధికారపక్షమైన వైకాపా ప్రయోజనాలను పరిరక్షించటం, ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడటమే తమ ప్రధాన విధి, బాధ్యతన్నట్లుగా పని చేస్తోంది. ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తోంది. విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపుతూ సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తే అరెస్టులు చేస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులను విమర్శిస్తే చాలు.. అక్రమంగా నిర్బంధిస్తోంది. కొన్నిసార్లు థర్డ్ డిగ్రీ చిత్రహింసలకూ గురి చేస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలాడుతూ.. వారి చిత్రాలు మార్ఫింగ్ చేస్తూ.. వారి కుటుంబంలోని మహిళలను దూషిస్తూ, అసభ్య పదజాలంతో వైకాపా సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు పోస్టులు పెట్టినా వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టే స్వయంగా ఆదేశించినా సరే.. ఉదాసీనత ప్రదర్శిస్తోంది. ‘వైకాపా నాయకులు ఆదేశిస్తారు.. అదే సీఐడీ పాటిస్తుంది’ అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. న్యాయస్థానాలు పదే పదే ఆక్షేపిస్తున్నా సీఐడీ తీరు మారట్లేదు. తాజాగా సీఎంవోలోని ఓ అధికారికి వ్యతిరేకంగా వాట్సప్లో వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణపై 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబును అరెస్టు చేసింది. నేరపూరిత కుట్ర అభియోగం మోపింది. సీఐడీ వేధింపులకు ఇలాంటి ఘటనలు కొన్ని తార్కాణాలు మాత్రమే. ఐటీడీపీ కార్యకర్తలు, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది.
ఏకపక్ష, పక్షపాత ధోరణి..
పోలీసు అంటే చట్టబద్ధంగా వ్యవహరించాలి. తటస్థంగా ఉండాలి. నేరానికి పాల్పడిన వ్యక్తులు అధికార పార్టీ వారైనా.. ప్రతిపక్షం వారైనా ఒకేలా వ్యవహరించాలి. కానీ సీఐడీ తీరు పూర్తి భిన్నం. ‘అధికార వైకాపా నాయకులు ఎలాంటి నేరం చేసినా ఒప్పే... ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా మహా నేరమే’ అన్నట్లు సీఐడీ వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైకాపా నాయకులు, ఆ పార్టీ సానుభూతిపరులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు ఇచ్చేంతవరకూ సీఐడీ కేసు నమోదు చేయలేదు. తప్పనిసరై కేసు కట్టినా నిందితులపై చర్యలే తీసుకోలేదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేదు. నిందితులంతా వైకాపా సానుభూతిపరులు, ఆ పార్టీతో అనుబంధం కలిగిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు కావటమే దీనికి ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. సీఐడీ పరువు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడిందే తప్ప.. అధికార పార్టీ వారిపై చర్యలు తీసుకోలేదు. చివరికి హైకోర్టే జోక్యం చేసుకుని ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాతే నిందితులు అరెస్టు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, అధికార పక్షానికి కొమ్ము కాస్తోందని చెప్పటానికి ఇంతకంటే రుజువులేమిటి?
* రాజధాని మహిళా రైతులపై వైకాపా నాయకులు అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసి రెండేళ్లు దాటినా ఇప్పటివరకూ కేసూ లేదు.. చర్యలూ లేవు.
* రాజమహేంద్రవరం అర్బన్ తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని.. అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా చర్యలు లేవు.
* చంద్రబాబు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రికా ప్రకటన విడుదల చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదిస్తే.. దానిపై చర్యలు తీసుకోలేదు.
* ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రెస్నోట్ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు అనేకమందిపై కేసులు పెట్టారు.
భయభ్రాంతులకు గురిచేయడమే..
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపట్ల ఉగ్రవాదులతో వ్యవహరించినట్లే సీఐడీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులిస్తే సరిపోతుంది. కానీ సీఐడీ అధికారులు ఆ నిబంధనలను పాటించకుండా.. అరెస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు పదేపదే సీఐడీ తీరును తప్పుపడుతూ నిందితులకు రిమాండు ఇవ్వడానికి నిరాకరిస్తున్నప్పటికీ సీఐడీ ధోరణి మారట్లేదు. న్యాయస్థానాలు రిమాండు విధించవని తెలిసీ సీఐడీ ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకంగా అరెస్టులు చేస్తోందని న్యాయవాదులు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించేందుకు, బెదిరించేందుకు సీఐడీ ఇలా చేస్తోందని చెబుతున్నారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లోగా న్యాయస్థానంలో హాజరుపరచొచ్చన్న నిబంధనను తమకు అనుకూలంగా మలచుకుంటోందని పేర్కొంటున్నారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత అరెస్టు చేయటం.. రాత్రంతా వారిని సీఐడీ కార్యాలయంలో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేయటం మరుసటి రోజు సాయంత్రం వరకూ తమ కస్టడీలోనే ఉంచుకుని 24 గంటల సమయం అయిపోతుందనగా చివరి క్షణంలో న్యాయస్థానంలో హాజరుపరచటం అనే విధానాన్ని సీఐడీ అనుసరిస్తోంది. న్యాయస్థానం రిమాండు తిరస్కరించినా సరే.. అప్పటికే వారిని చిత్రహింసలకు గురిచేసి ఉండటంతో తాము అనుకున్న పనైపోయిందని భావిస్తోంది. ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఘటనలే ఇందుకు తార్కాణం.
పోస్టు పెడితే కుట్రకు పాల్పడినట్లేనా?
ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెడితే చాలు.. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు, నేరపూరిత కుట్ర చేసినట్లు, రాజ ద్రోహానికి పాల్పడినట్లు సీఐడీ వారిపై కేసులు పెడుతోంది. వాటిని అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతోంది. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, తటస్థులు, పాత్రికేయులు.. వారూ.. వీరూ అనే తేడా లేదు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తితే చాలు.. వారిపై కేసులు పెట్టి అణచేస్తోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరు.
* విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రమాదంపై ఫేస్బుక్లో ఒక పోస్టు షేర్ చేసినందుకు పి.రంగనాయకి అనే 60 ఏళ్ల వృద్ధురాలిపై సీఐడీ కేసు నమోదు చేసింది. విచారణ పేరిట వేధింపులకు గురిచేసింది.
* ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపుతూ విమర్శలు చేసే వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపైనా, వాటిని ప్రసారం చేశారంటూ మీడియా ఛానళ్లపైనా రాజద్రోహం కేసులు పెట్టారు. సీఐడీ పోలీసులు తనను కస్టడీలోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలకు గురిచేశారని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
* ఈ ఏడాది ఏప్రిల్ వరకూ మంత్రిగా కొనసాగి, ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టు ఫార్వర్డ్ చేశారంటూ విశాఖపట్నానికి నలంద కిశోర్, కృష్ణా జిల్లా నందిగామ మండలం చెరువు కొమ్ముపాలేనికి చెందిన చిరుమామిళ్ల కృష్ణారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. నలంద కిషోర్ను విశాఖపట్నం నుంచి కర్నూలుకు తరలించింది. తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణించారు.
* ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రదర్శించారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సీఐడీ కేసు పెట్టింది. విచారణ పేరిట వేధించింది.
* ఓ నకిలీ ప్రెస్నోట్ను సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీషకు రాత్రి 10.30 గంటల సమయంలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. వారు రాసుకొచ్చిన వాంగ్మూలంపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు.
5 కిలోమీటర్ల దూరం వరకూ కొడుతూనే ఉన్నారు...
‘అర్ధరాత్రి నన్ను ఇంట్లోంచి లాక్కొచ్చి సీఐడీ పోలీసులు వాహనం ఎక్కించారు. నాకు అటూఇటూ ఇద్దరు పోలీసులు కూర్చొన్నారు. ఒకరు మోచేత్తో బలంగా నా ముఖంపై కొట్టారు. పెదవి పగిలి రక్తం కారుతుండటంతో ఆ బాధతో నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ముందుకు వంగాను. అప్పుడు మెడపై గట్టిగా కొట్టారు. 5 కిలోమీటర్ల దూరం వరకూ కొడుతూనే ఉన్నారు. నన్ను అదుపులోకి తీసుకున్నప్పుడు తలుపులు విరగ్గొట్టి, లైట్లు ఆర్పేసి మా ఇంట్లోకి ప్రవేశించారు.
- యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గార్లపాటి వెంకటేశ్వరరావు
దుస్తులు విప్పదీసి మరీ కొట్టారు
‘సీఐడీ అధికారులు నా దుస్తులు విప్పి మరీ కొట్టారు. రెండు చేతులూ పైకి కట్టేసి.. వాటి మధ్యలో కర్రపెట్టి అరికాళ్లపై కొట్టారు. బల్లపై పడుకోబెట్టి... నా నడుంపై కూర్చొని కాళ్లు పైకి ఎత్తిపట్టి కొట్టారు. వృషణాల్లో పొడిచే ప్రయత్నం చేసి నన్ను భయపెట్టారు. కొట్టిన విషయం మెజిస్ట్రేట్ ఎదుట చెబితే నా రెండేళ్ల కుమారుణ్ని చంపేస్తానన్నారు. నా కుటుంబం మిగలదని బెదిరించారు.
- యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బి.వెంగళరావు
కోర్టుకు వెళ్లే వీల్లేకుండా ఎత్తుగడ
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన తర్వాత 24 గంటల్లోగా వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ ఏపీ సీఐడీ ఆ నిబంధనలేవీ పాటించట్లేదు. ఈ విభాగం నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లన్నింటినీ రహస్యంగానే ఉంచుతోంది. ఆయా ఎఫ్ఐఆర్లలో నిందితులుగా పేర్కొన్న వారి ఇళ్లపై ఆకస్మికంగా సోదాలు జరిపి అరెస్టులు చేస్తున్నట్లు ప్రకటించి వారిని బలవంతంగా తీసుకెళ్లిపోతోంది. చాలా సందర్భాల్లో నిందితులకు, వారి తరఫు న్యాయవాదులకు వెంటనే ఎఫ్ఐఆర్ లభించని పరిస్థితి ఉంటోంది. ముందస్తు బెయిలు పొందకుండా ఉండేందుకు, న్యాయస్థానాల్ని ఆశ్రయించే వీల్లేకుండా చేసేందుకే సీఐడీ ఇలా వ్యవహరిస్తోందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని వారు చెబుతున్నారు.
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?
అధికార పార్టీ నేతలపై, రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా పోస్టులు పెడితే సత్వరమే స్పందిస్తున్న సీఐడీ.. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన వారిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? 19 మందిపై పేర్లతో సహా ఫిర్యాదు ఇస్తే.. ముఖ్య నేతల్ని వదిలేసి 9 మందిపైనే ఎందుకు కేసులు నమోదు చేశారు? న్యాయ వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకరమైన దాడి జరుగుతుంటే హైకోర్టుకు మద్దతుగా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు?
గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయి
రాష్ట్ర పోలీసులకు చట్టబద్ధ పాలన అంటే గౌరవం లేదు. హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉత్సాహం చూపని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్టులు చేస్తున్నారు. గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు.
- హైకోర్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్