పాదయాత్రకు పోటెత్తిన కృష్ణా
కష్టనష్టాలను పంటిబిగువన భరిస్తూ అమరావతి రైతులు ఒకటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ నాయకుల కవ్వింపులకు తోడు పోలీసుల ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా అడుగు ముందుకే వేస్తున్నారు. ఎండ వేడిని లెక్కచేయకుండా
అడుగడుగునా అమరావతి రైతులకు బ్రహ్మరథం
గుడివాడ నియోజకవర్గంలో భారీగా జనం
ఏలూరులోకి ప్రవేశించిన అన్నదాతలు
ఈనాడు, అమరావతి: కష్టనష్టాలను పంటిబిగువన భరిస్తూ అమరావతి రైతులు ఒకటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ నాయకుల కవ్వింపులకు తోడు పోలీసుల ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా అడుగు ముందుకే వేస్తున్నారు. ఎండ వేడిని లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఆదివారం పాదయాత్రలో ఉత్సాహంగా నడిచారు. కొండంత విశ్వాసంతో రాజధాని లక్ష్యం దిశగా అలుపెరగకుండా సాగారు. నందివాడ మండలం రామాపురం గ్రామస్థులు రైతులు, మహిళలపై పూలవర్షం కురిపించారు. గుడివాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు కర్షకులపై ఆదరాభిమానాలు చూపారు. వారికి మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి వచ్చిన రైతులు భారీ జాతీయ పతాకాన్ని వెంట తెచ్చారు. దాన్ని రైతులు, మహిళలు అన్ని వైపులా పట్టుకుని పాదయాత్రలో నినదిస్తూ రామాపురం వరకు నడిచారు. వైకాపా ప్రభుత్వం తమపై, రాజధాని అమరావతిపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రైతులు తమ వాదనలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పులోని ముఖ్యాంశాలను కరపత్రంలో ఉటంకించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బాధిత రైతాంగ పోరాట వేదిక కన్వీనర్ తన్నీరు వెంకటేశ్వర్లు.. పాదయాత్రలో ప్రదర్శించిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంది. పాదయాత్రను ఆత్మగౌరవ యాత్రగా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. నందివాడ మండలం జనార్దనపురం, జొన్నపాడు, నందివాడ మీదుగా తుమ్మలపల్లి వరకు యాత్ర సాగింది. అక్కడ మధ్యాహ్న విరామానికి ఆగింది. అనంతరం ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. యాత్రలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్టు డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, నేతలు రావి వెంకటేశ్వరరావు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ పిన్నమనేని, ఆళ్ల గోపాలకృష్ణ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమరావతి కేవలం 29 గ్రామాలకు సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరూ అన్నదాతలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
సరిహద్దులో హార్ధిక స్వాగతం
పాదయాత్ర కృష్ణా జిల్లా దాటి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొనికిలోకి ప్రవేశించగానే తెదేపా నేతలు, గ్రామస్థులు రైతులకు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా అమరావతి నినాదాలతో హోరెత్తింది. కృష్ణా జిల్లా పరిధిలో యాత్ర ముగియడంతో తమకు మద్దతుగా వెంట నడిచిన జిల్లా వాసులకు కృతజ్ఞతగా, మోకాళ్లపై నిల్చొని రైతులు నేలను నమస్కరించారు. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల జీవనాడి అని ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ‘దీన్ని నాశనం చేసేందుకు సీఎం జగన్ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. మాకు రాజధాని కావాలని ఉత్తరాంధ్ర వాళ్లు అడగలేదు. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే మా డిమాండ్. ఒక్క రాజధానిని కట్టలేక ఈ పల్లవిని ఎత్తుకున్నారు. నిర్మాణమై బాగా అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని ఎందుకు? ఎక్కడ శాసనసభ, హైకోర్టు ఉందో అక్కడే రాజధాని ఉండాలి. దేశంలో ఎక్కడా లేని విధానం మనకెందుకు?’ అని ఆయన ప్రశ్నించారు.
14వ రోజు పాదయాత్ర ఇలా..
ప్రారంభం: గుడివాడ పట్టణ శివారు నాగవరప్పాడు నుంచి
ముగింపు: ఏలూరు జిల్లా కొనికి
ప్రయాణించిన దూరం: 15 కి.మీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!